ఏపీ రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను సీఎం జగన్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ భార్యకు సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి మొక్కను అందజేశారు. అనంతరం గవర్నర్తో సీఎం జగన్ ఏకాంతంగా 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. నవంబర్ 1న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను సీఎం జగన్ ఆహ్వానించారు. అనంతరం శాసనసభా సమావేశాల నిర్వహణ, టీడీపీ కార్యాలయాలపై…
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్కు బెయిల్ రావడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తరఫున బాంబే హైకోర్టులో సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. దేశంలో ఆయన చాలా ఫేమస్ లాయర్. అటార్నీ జనరల్గానూ పనిచేశారు. ఈ నేపథ్యంలో ముకుల్ రోహత్గీ వంటి లాయర్ వాదించబట్టే ఆర్యన్ ఖాన్కు బెయిల్ వచ్చిందని దర్శకుడు వర్మ అభిప్రాయపడ్డాడు. Read Also:…
హైదరాబాద్ నగరంలో పోలీసులు గంజాయిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా సిటీ మొత్తం పోలీసులు జల్లెడ పడుతున్నారు. టూవీలర్పై వెళ్తున్న కొంతమంది యువకులను ఆపి తనిఖీలు చేస్తున్నారు. యువకుల మొబైల్ చాటింగులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో తమ ప్రైవసీకి పోలీసులు భంగం కలిగిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ అంశంపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరణ ఇచ్చారు. నిందితుల కదలికలు, నేరస్థుల అనుచరులపై నిఘా పెట్టేందుకే పలువురి మొబైల్…
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు ఎట్టకేలకు ఊరట కలిగింది. అతడికి బెయిల్ మంజూరు చేస్తూ గురువారం నాడు బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. 21 రోజులుగా ఆర్యన్ ఖాన్ జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఓ స్టార్ హీరో తనయుడు ఇన్నిరోజుల పాటు జైలులో ఉండటం అటు బాలీవుడ్ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కాగానే…
సాధారణంగా మనిషి నిమిషానికి 15-20సార్లు తెలియకుండానే కళ్లు ఆర్పుతాడు. అయితే మనం ఏదైనా అద్భుతాన్ని చూస్తే కళ్లు అప్పగించుకుని అలాగే చూస్తుంటాం. అయినా అలా ఓ రెండో, మూడో నిమిషాలు చేయగలం. కానీ ఓ వ్యక్తి రికార్డు స్థాయిలో గంటకు పైగా కళ్లు ఆర్పలేదంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. Read Also: అర్దనగ్నంగా మంగళ సూత్రం యాడ్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్ ఫిలిప్పీన్స్ యాక్టర్, కమెడియన్ పాలో బల్లెస్టెరోస్ ఏకంగా 1 గంటా 17 నిమిషాలు…
హైదరాబాద్ నగరంలోని హిమాయత్నగర్లో మిస్ తెలంగాణ-2018 విజేత హాసిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సోషల్ మీడియా లైవ్లోనే ఆమె ఈ ఘటనకు పాల్పడగా ఈ వీడియో చూసిన స్నేహితులు అప్రమత్తమై డయల్ 100కు సమాచారం అందించారు. నారాయణగూడ పోలీసులు స్పందించి వెంటనే హిమాయత్ నగర్ రోడ్ నం.6లోని యువతి ఫ్లాట్కు చేరుకుని ఆమెను రక్షించారు. ప్రస్తుతం హాసిని హైదర్గూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె క్షేమంగానే ఉందని పోలీసులు తెలిపారు. Read Also: తీవ్రమయిన వెన్నునొప్పితో…
ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలపై దాడి అంశాన్ని ఆ పార్టీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దృష్టికి తీసుకువెళ్లగా… తాజాగా టీడీపీపై వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ ఎంపీలు టీడీపీపై ఫిర్యాదు చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, తక్షణమే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. Read Also: ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టాలని కోరుకుంటాం:…
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు మరోసారి కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా అమ్మకాల ఒత్తిడిని తట్టుకోలేక సెన్సెక్స్ భారీ నష్టాలను చవి చూసింది. ఉదయం పూట నష్టాలతోనే మొదలైన మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 1158 పాయింట్లు దిగజారి 59,984 వద్ద స్థిరపడింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ కూడా 353 పాయింట్లు నష్టపోయి 17,857 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు…
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 29న కుప్పంలో పర్యటించనున్నారు. గత పది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్యా కుప్పంలో చంద్రబాబు పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కుప్పంలో రెండు రోజులు పర్యటించనున్న చంద్రబాబు.. 29 కుప్పంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు 30న కుప్పం పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కుప్పంలో టీడీపీ ఉనికి కొల్పొకుండా ఉండేందుకు గ్రామస్థాయి…
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లాప్ట్యాప్లు, ట్యాబ్లు కొనుగోలు చేయలేని పరిస్థితిలో చాలా మంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. అలాంటి వారికోసం గవర్నర్ తమిళసై ఓ అడుగు ముందుకువేసి నిరుపయోగంగా ఉన్న ట్యాబ్లు, ల్యాప్టాప్లు ఇవ్వాలని ఐటీ కంపెనీలను, సంస్థలను ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రాజ్భవన్లో దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.…