AP Government: మత్స్యకారుల కుటుంబాలకు సర్కార్ గుడ్న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గత ఆరేళ్లుగా (2018 నుండి) పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా కేసులను పరిష్కరిస్తూ.. వాటికోసం నిధులను విడుదల చేసింది. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించి, పెండింగ్ ఫైళ్లను తక్షణమే క్లియర్ చేయాలని ఆదేశించారు.
Also Read
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
- Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
95 కుటుంబాలకు రూ. 4.75 కోట్ల సాయం చేస్తోంది ఏపీ సర్కార్.. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GAIS) కింద 2018 సంవత్సరం నుండి వివిధ సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన కేసులను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంది. ప్రమాదవశాత్తు మరణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలను గుర్తించారు. ఇక, ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 4.75 కోట్లను ఎక్స్గ్రేషియాగా ప్రభుత్వం మంజూరు చేసింది. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇప్పటికే 90 మంది లబ్ధిదారుల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నగదు నేరుగా జమ అయింది. మిగిలిన 5 మంది లబ్ధిదారుల ఖాతా వివరాల్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యలను కూడా త్వరగా పరిష్కరించి, వారికి కూడా తక్షణమే నిధులు అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!