పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసకుంది. కొడుకు మరణాన్ని తాళలేక అమ్మ, అమ్మమ్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. భీమవరంకు చెందిన కార్తీక అనే యువకుడు విజయవాడలో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. కార్తీక్ అమ్మ ఇందిర (50), అమ్మమ్మ కుమారి (75) లు కార్తీక్ లేడని మనస్థాపానికి గురై ఈ రోజు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు…
నేటి సమాజంలో టెక్నాలజీ పెరిగిపోయింది. రోజురోజు అత్యాధునిక సాంకేతికతతో ప్రంపచం ముందు వెళుతోంది. కానీ.. కొంతమంది యువత మాత్రం మత్తులో చిత్తవుతూ.. వారి జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఏపీలో ఎక్కడ తనిఖీలు చేపట్టినా భారీగా గంజాయి బయటపడుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసు శాఖ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లను నిత్యం తనిఖీలు చేస్తూ గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో సైతం మాదకద్రవ్యాల…
ఒకప్పుడు సరైన సమయంలో వర్షాలు కురియక రైతులు ఆందోళన చెందేవారు. ఒక్కోసారి అతి వర్షాలు కురిసి పంటకు నష్ట వాటిల్లేది. ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్న రైతులు ఎప్పుడూ వినని మాటలు రాజకీయ నాయకుల నోటి నుంచి వింటున్నారు. ఆ మాటలతో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. ఓ రాజకీయ పార్టీ అధినేత వరి వేస్తే ఊరే అంటే.. మరో రాజకీయ పార్టీ నేత వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తానంటున్నారు.. ఇలా రాజకీయ…
తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని కోరేందుకు కేటీఆర్తో కలిసి ఢిల్లీలో పీయూష్ గోయల్ కలిశామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పంటల కొనుగోలు బాధ్యత కేంద్రానిది, రాజ్యాంగం ప్రకారం అది కేంద్రం బాధ్యత అని విజ్ఞప్తి చేశామన్నారు. దానికి పీయూష్ గోయల్ వెకిలినవ్వు నవ్వారు .. ఇప్పటికే నిల్వలు మురిగిపోతున్నాయి .. కొననే కొనం అని అన్నారని వెల్లడించారు. మాది కొత్త రాష్ట్రం.. ఇప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం అని కోరినా పట్టించుకోలేదు .. క్రాప్ చేసుకోండి అని…
కూంబింగ్ నిర్వహించే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబి ట్రాప్లు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మల్లంపేట అటవీ ప్రాంతంలో బూబి ట్రాప్ లు మావోయిస్టులు అమర్చారు. కూబింగ్ చేసే పోలీస్ బలగాలు లక్ష్యంగా ఏడు చోట్ల పదునైన వెదురు కర్రలతో బూబి ట్రాప్లను మావోలు ఏర్పాటు చేశారు. కానీ… చింతూరు డివిజన్ పోలీసులు ఎంతో చాకచక్యంగా బూబి ట్రాప్ లను గుర్తించి ధ్వంసం చేశారు. కాలిబాటల్లో గోతులు తవ్వి పదునైన వెదురు కర్రలతో…
తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ షెడ్యూల్కు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. లోకల్ 12 సీట్లకు షెడ్యూల్ ప్రకటన చేయగా.. ఆదిలాబాద్, వరంగల్, మెదక్ నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం లో ఉన్న ఒక్కొక్క సీటు,మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లా రెండు స్థానాలకు ఎన్నిక జరుగనుంది. నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23 నామినేషన్ల…
ఏపీ పీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా సభ్యత్వ నమోదు చేయడం ద్వారా ఏడాదిలో పార్టీ సంస్థాగతంగా బలపడతుందని ఆయన అన్నారు. ప్రతి కార్యకర్త గురుతర బాధ్యతతో ఇంటి వద్దనే సభ్యత్వ నమోదు జరిగేలా జిల్లా పార్టీ అధ్యక్షులు చొరవ చూపాలన్నారు. కమిటీల ఏర్పాటుతో పాటు మండల స్థాయి నుంచి నమోదుకు పార్టీలో గుర్తింపు ఇవ్వాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్ముకొనేవాడు…
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు రాష్ట్రం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అంతేకాకుండా ఆహార పంపిణీతో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం ఎంకే స్టాలిన్ ఆహార పంపిణీని పరిశీలించారు. వర్షాలు తగ్గేవరకు అమ్మక్యాంటీన్ల ద్వారా ఉచిత ఆహారం అందిస్తామని వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి 11 న ఉత్తర తమిళనాడు తీరానికి చేయకునే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40,60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. 7 నుండి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే…
కామారెడ్డి టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని ఆరోపించారు. అంతేకాకుండా పెన్షన్లను పది రెట్లు పెంచామని, 42 లక్షల మందికి 10వేల కోట్ల పెన్షన్లు ఇస్తున్నామన్నారు. వైద్య వ్యవస్థపై విశ్వాసం పెంచామని, జనం సర్కార్ దవాఖానకు పోయేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పలేరని, టీఆర్ఎస్ అభివృద్ధిని బీజేపీ పాదయాత్రలోనే బయటపెట్టారన్నారు. ఉత్తర భారతదేశానికి ఓ…