మొన్న జరిగిన టీ20 పరిణామాల తరువాత టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రోహిత్ శర్మ ను కెప్టెన్గా ప్రకటిస్తూ బీసీసీఐ ప్రకటన చేసింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన సునీల్ గవాస్కర్.. రోహిత్ గుడ్ ఛాయిస్ అంటూ కితాబిచ్చారు.
వచ్చే ఏడాదిలో వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇండియాకు కప్పు అందించే సత్తా ఉన్నవారినే మార్గదర్శగా నిర్ణయించడ మంచిదని అందుకు.. రోహిత్ కి కెప్టెన్సీ ఇవ్వడం మంచిదన్నారు. రోహిత్ శర్మ ను కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ, వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ను ఎంపిక చేసింది.