Home
Latest News
Latest News News
-
అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లే : ఉండవల్లి అరుణ్ కుమార్
ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రతిపక్ష లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని అన్నారు. అంతేకాకుండా కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని, అప్పులు తగ్గించి ఆదాయం పెంచుకోనే మార్గాలను అన్వేషించాలని హితవు పలికారు. రాష్ట్రానికి 6 లక్షల 22 కోట్ల రూపాయలకు… -
ఏకే రావు కేసులో ట్విస్ట్.. ఆ రిపోర్ట్ కీలకంగా మారనుందా..?
టాలీవుడ్ సింగర్ హరిణి తండ్రి, సుజాన ఫౌండేషన్ సీఈవో ఏకే రావు మృతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. వారం రోజులుగా కనిపించకుండపోయిన హరిణి కుటుంబ సభ్యులు.. బెంగుళూరు సమీపంలో ఓ రైల్వే ట్రాక్పై ఏకే రావు మృతదేహం లభ్యమయ్యాక రైల్వే పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. ఏకే రావు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముందు ఆత్మహత్య అనుకున్నా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మర్డర్ కేసుగానే కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేస్తున్న… -
ఆ దేశాల నుంచి విమానాలు నిలిపివేయండి : కేజ్రీవాల్
కరోనా మహమ్మరి యావత్తు ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. కోవిడ్ ప్రభావంతో ఎన్నో కుటుంబాలు అల్లకల్లోలమయ్యాయి. ఎంతో మంది అనాథలుగా మారారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి భారతవాని కోలుకుంటోంది. అయితే తాజాగా మరో వేరియంట్ B.1.1.529 ప్రబలుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై నేడు ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించనున్నారు. కోవిడ్-19 పరిస్థితి, టీకాపై పీఎం నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా,… -
డేంజర్ బెల్స్ మోగిస్తున్న రాయలచెరువు.. మరో 3 చోట్ల లీకేజీలు..
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికీ భారీ వర్షాలతో వాగుల, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువు కట్టలు తెగిపోవడంతో కింద ఉన్న గ్రామాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. అయితే తాజాగా రాయల్ చెరువు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాయల చెరువుకు ఇప్పటికే గండి పడడంతో అధికార యంత్రాంగం దానిని పూడ్చేపనిలో నిమగ్నమైంది. ఇప్పుడు కింది గ్రామాలు ఉలిక్కిపడేలా రాయల చెరువుకు మరో 3 చోట్ల నుంచి నీరు లీకవుతోంది. Also Read : చెయ్యేరు బీభత్సం.. ఇంకా… -
చెయ్యేరు బీభత్సం.. ఇంకా కానరాని 12 మంది ఆచూకీ..
భారీ వర్షాలు ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలతో కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడంతో చెయ్యేరు నదికి వరద పోటెత్తింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్టు కింద ఉన్న 12 గ్రామాలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాలైతే ఇక్కడ ఊర్లు ఉండేవి అనేంతా కొట్టుకుపోయాయి. ఇళ్లు, వాకిలి, పశువులు కొట్టుకుపోవడంతో అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ వరద బీభత్సవానికి పలు గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. అయితే ఈ వరదల్లో 39 మంది… -
గోదావరిఖనిలో భారీ అగ్నిప్రమాదం.. 11 లక్షల ఆస్తి నష్టం
పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో భారీ అగ్ని ప్రమాదంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోదావరిఖనిలోని లక్ష్మీనగర్ ఫ్యాషన్ వరల్డ్ మెన్స్ వేర్ లో తెల్లవారు జామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అయితే బట్టలకు సంబంధించిన దుకాణం కావడంతో మంటలు భారీగా చెలరేగి ఆగ్నికీలలు పక్కనే ఉన్న దుకాణాలపై పడి మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి… -
పెళ్లైన 27 రోజులకే నవవధువు అనుమానస్పద మృతి..
హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 27 రోజులకే ఓ నవవధువు అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన పాతబస్తీలోని రెయిన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పాతబస్తీ కి చెందిన రషీద్, షఫియా ఫాతిమా (21) లకు 27 రోజుల క్రితం వివాహం జరిగింది. అయితే ఏంజరిగిందో ఏమో తెలియదు గానీ.. స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో రషీద్ ఇంట్లో ఫాతిమా మృతదేహం అనుమానస్పద స్థితిలో లభ్యమైంది. ఈ మేరకు కేసు… -
27వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర..
సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర నవంబర్ 1న ప్రారంభమైంది. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ ప్రారంభించిన ఈ మహాపాదయాత్ర డిసెంబర్ 15న తిరుమలకు చేరుకోనుంది. అయితే నేడు 27వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఈ రోజు నెల్లూరు జిల్లాలో 12 కిలోమీటర్ల మేర కొనసాగనున్న రైతుల పాదయాత్ర అంబాపురం వద్ద ముగియనున్నట్లు అమరావతి రైతుల జేఏసీ… -
తమిళనాడులో తగ్గేదేలే అంటున్న వరుణుడు..
తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 15 రోజుల నుంచి తమిళనాడులో తగ్గేదేలే అన్నట్లుగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో చెన్నై సహా 23 జిల్లాలోని స్కూల్స్ కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నిన్న రాత్రి నుంచి చెన్నైలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. Also Read : అండమాన్లో అలజడి.. మరోసారి ఏపీకి భారీ వర్షసూచన.. అంతేకాకుండా మెరీనా… -
రాజమౌళి ‘RRR’ మూవీ రన్టైమ్ ఎంతో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘RRR’ మూవీ విడుదల సమయం దగ్గర పడుతోంది. మరో నెల మాత్రమే ఈ సినిమా రిలీజ్కు టైమ్ ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. తాజాగా సెన్సార్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది.…
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!