Home
Latest News
Latest News News
-
అలర్ట్ : కరోనాపై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ
రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది కరోనా మహమ్మారి. కరోనా వైరస్ కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. డెల్టా వేరియంట్ రూపంలో సెకండ్ వేవ్ సృష్టించిన కరోనా రక్కసి ఒమిక్రాన్ వేరియంట్తో థర్డ్ వేవ్కు బాటలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గత నెల మొదటి వారం వరకు దేశవ్యాప్తంగా సుమారు 9 వేల లోపు కరోనా కేసులు నమోదుకాగ, తాజాగా ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 90వేల పై చిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర… -
అమ్మ, చెల్లిలను రాజకీయంగా వాడుకొని వదిలేసాడు : చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రామకుప్పం మండలం అరిమాను పెంట గ్రామంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అమ్మ, చెల్లిలను రాజకీయంగా వాడుకొని వదిలేసాడని సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పోలవరం 71 శాతం పూర్తి చేసామని, ఇవ్వాళే భారతి సిమెంట్ బస్తా పై 30 రూపాయలు పెంచారని ఆయన మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో జగన్ మూడు ఇళ్లు కూడా నిర్మించలేదని, సాక్షిలో మేనేజర్గా పని చేసే వ్యక్తి నన్ను… -
ప్రధాని మోడీ పంజాబ్ టూర్పై పీసీసీ సెటైర్లు..
ప్రధాని మోడీ నిన్న పంజాబ్ పర్యటనకు వెళ్లగా అక్కడి రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మోడీ కాన్వాయ్కి అడ్డంగా సుమారు 15 నిమిషాల పాటు రైతులు నిరసన తెలపడంతో, మోడీ తిరిగి వెళ్లిపోయారు. అయితే దీనిపై పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ సైటెర్లు వేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దులో రైతులు నిరసన తెలిపారన్నారు. కానీ ప్రధాని మోడీ వారి కోసం 15… -
చంద్రబాబు కుప్పం బాట పట్టడం మా నైతిక విజయం : మంత్రి పెద్దిరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు పర్యటనపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ఎన్నికలప్పుడే చంద్రబాబు కుప్పంకు వచ్చే వారని, ఈరోజు గ్రామాలు తిరగాలని చంద్రబాబు ఆలోచన చేశారన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా కుప్పంలో చంద్రబాబు పర్యటించని గ్రామాలు ఉన్నాయని, సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మేము మా ఎమ్మెల్యేలు అన్ని గ్రామాలు తిరుగుతున్నామన్నారు. కేవలం… -
రెండు ఘటనలు కుప్పంలో నన్ను బాధించాయి : చంద్రబాబు
నేడు టీడీపీ అధినేత కుప్ప నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా రెండు ఘటనలు కుప్పంలో నన్ను బాధించాయని ఆయన అన్నారు. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు నన్ను బాధపెట్టాయని, కుప్పంలో డబ్బులు పంచే తీరు ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. వెయ్యి, రెండు వేలు పంచి ఓట్లు అడిగే పార్టీ కాదు టీడీపీ అని, కుప్పంలో ఓటమి అంటూ నన్ను ఎగతాళి చేస్తే….మిమ్మల్ని అన్నట్లు కాదా..?… -
నేను మీ అందరి కుటుంబ సభ్యుడ్ని.. ఉద్యోగ సంఘాల భేటీలో జగన్..
పీఆర్సీపై ఏపీలో క్లారిటీ రావడంలేదు. దీంతో ఎప్పటినుంచో ఉద్యోగ సంఘాలు సీఎం జగన్తో భేటీ కావాలని ఆశించడంతో వారితో జగన్ ఈ రోజు భేటీ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ నిర్వహించిన భేటీ ముగిసింది. సమావేశంలో సీఎం జగన్ ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నానని వెల్లడించారు. అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని, ప్రాక్టికల్గా… -
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు బహిరంగ లేఖ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు బహిరంగ లేఖను విడుదల చేశారు. వనమా రాఘవను పోలీసులకు అప్పగించేందుకు సహకరిస్తానని లేఖలో వనమా వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. అంతేకాకుండా పోలీసులకు, న్యాయవ్యవస్థకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. వనమా రాఘవను నియోజకవర్గానికి,… -
ఎక్కువ అవినీతి జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి : జేపీ నడ్డా
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. దీంతో నేడు బీజేపీ శ్రేణులు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అయితే జేపీ నడ్డాను అడ్డుకునేందుకు అప్పటికే ఎయిర్పోర్ట్కు చేరుకున్న పోలీసులు తెలంగాణలోని కోవిడ్ నిబంధనల గురించి వివరించారు. దీంతో ఆయన కోవిడ్ నిబంధనల ప్రకారమే నిరసన తెలియజేస్తానన్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్… -
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా ఎన్నికేసులంటే..?
కరోనా రక్కసి మరోసారి తెలంగాణాలో రెక్కలు చాస్తోంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో యావత్తు దేశంతో పాటు తెలంగాణవాసులూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కూడా తెలంగాణలో వ్యాప్తి చెందుతుండడంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. అయితే తాజాగా తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1,052 కరోనా కేసులు రాగా, ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో మరో 240 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా… -
బుక్ ఫెయిర్ సందర్భంగా పుస్తక ప్రియుల పాదయాత్ర
విజయవాడ పుస్తక ప్రియులను అలరించటానికి 32వ పుస్తక ప్రదర్శన విజయవాడలో జనవరి 1న ప్రారంభమైంది. బందరురోడ్ లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో జనవరి 1నుంచి 11 వ తేదీ వరకు జరిగే పుస్తక మహోత్సవం నిర్వహించనున్నారు. అయితే బుక్ ఫెయిర్ సందర్భంగా నేడు పుస్తక ప్రియులు పాదయాత్రి నిర్వహించారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ నుంచి స్వరాజ్ మైదానం వరకు ఈ పాదయాత్ర జరిగింది. అయితే ఈ పాదయాత్రను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ ప్రారంభించారు. అంతేకాకుండా…
తాజావార్తలు
-
Dhanush : ధనుష్ నెక్ట్స్ లక్ష్యం రాజకీయాలేనా…? అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చి ఫ్యాన్స్ను రెచ్చగొట్టాడా..?
-
HMD Asha 305: HMD Asha 305 విడుదల.. 2GB RAM, 16GB స్టోరేజ్, 4Gతో చౌకైన స్మార్ట్ఫోన్
-
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్లో విషాదం.. హైదరాబాద్కి చెందిన ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
-
Ather Pothole+ Alerts: ఏథర్ స్కూటర్లకు కీలక అప్డేట్.. గుంతలు, స్పీడ్ బంప్లపై ముందే అలర్ట్! ఎలా పనిచేస్తుందంటే?
-
Vijay Deverakonda: సోలో హీరోగా పదేళ్లు.. ఫ్లాపులు వచ్చినా ఫ్యాన్ బేస్ తగ్గని ఏకైక స్టార్ విజయ్ దేవరకొండేనా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!