Home
Latest News
Latest News News
-
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన టీచర్స్
తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు జీవో 317ను రద్దు చేయాలని కోరుతూ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తాజాగా ప్రగతి భవన్ను ముట్టడికి టీచర్స్ యత్నించారు. దీంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు 70 మందికి పైగా టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట నుంచి ప్రగతి భవన్ వరకు పోలీసులు మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారు. అసంబద్దంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టారని, సీనియార్టీ ప్రకారం… -
రివ్యూ : హీరో
సినీ, రాజకీయ కుటుంబాలతో అనుబంధం ఉన్న అశోక్ గల్లా హీరోగా అరంగేట్రం చేసిన సినిమా ‘హీరో’. ఇటు తాత కృష్ణ పేరు మోసిన స్టార్ హీరో, మేనమామ మహేశ్ బాబు ఈ నాటి మేటి హీరో. వీరి అండదండలతో పాటు, అటు తండ్రి గల్లా జయదేవ్, నాన్నమ్మ గల్లా అరుణకుమారి రాజకీయరంగంలో పేరొందినవారు. వీరి వారసుడు కాబట్టి అశోక్ గల్లా ‘హీరో’పై అందరి దృష్టి మళ్ళింది. అయితే సినిమా నిర్మాణంలో జరిగిన తీవ్ర జాప్యంతో దీనిపై జనాలకు… -
భారతదేశం కోసం ఆవిష్కరణలు చేద్దాం : ప్రధాని మోడీ
ఈ రోజు ఉదయం 10.30 గంటలకు స్టార్టప్ల ప్రతినిధులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరు అంశాలపై స్టార్టప్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జనవరి 16ను జాతీయ అంకుర దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. అంకుర సంస్థలు నవ భారతానికి వెన్నెముకగా మారనున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశంలో కోసం ఆవిష్కరణలు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా భారతదేశం నుంచి ఆవిష్కరణలు చేద్దామన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలోనూ అంకుర… -
ఎస్సార్పురంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం..
ఏపీలో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని ఎస్సార్పురంలో గుర్తు తెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఘటనా స్థలం వద్దకు వైసీపీ కార్యకర్తలు చేరుకొని ధర్నా చేపట్టారు. అంతేకాకుండా ఘటనస్థలాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ.. పోలీసులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహ ధ్వంసానికి… -
తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు : గవర్నర్ తమిళిసై
సంక్రాంతి సందర్భంగా రాజ్ భవన్లో మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై దంపతులు, బంధువులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో రాజ్ భవన్లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పొంగల్ తయారు చేశారు. అనంతరం గవర్నర్ తమిళసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రోటోకాల్ను పాటిస్తూ పండుగ జరుపుకుందామని ఆమె పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు… -
బీజేపీ నేతలకు సవాల్ విసిరిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్లకు జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణలోని పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే.. మన దేశం అభివృద్ధిలో అమెరికాను దాటుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల లాంటివి బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు.… -
సంక్రాంతి ఎఫెక్ట్ : బోసిపోయిన భాగ్యనగరం..
నిశీది వేళలో సైతం నిద్రించని భాగ్యనగరం ఇప్పడు బోసిపోయింది. సంక్రాంతి పండుగ వేళ.. పట్నంవాసులు పల్లెలకు పరుగులు తీశారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు మహానగరంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని గడిపి.. సంక్రాంతి పండుగకు సొంతూళ్లో బంధుమిత్రులతో గడిపేందుకు ప్రజలు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రధాన రహదారులు వెలవెలబోతున్నాయి. ఎప్పడూ రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుష్యంగా తయారయ్యాయి. అటు ఏపీకి చెందిన వారు ఆంధ్రాకు పయనమైతే.. ఇటు తెలంగాణలోని వారి సైతం తమ ఊర్లకు… -
దేశంలో కొత్తగా 2,68,833 కరోనా కేసులు.. పెరిగిన పాజిటివిటీ రేటు..
కరోనా వైరస్ తగ్గెదేలే అనే విధంగా రోజురోజుకు పెరిగిపోతోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలను భయపడుతోన్న కరోనా రక్కసి.. ఒమిక్రాన్ వ్యాప్తి మరోసారి విజృంభిస్తోంది. కరోనా కేసులు దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్న వేళ పలు రాష్ట్రాలు కరోనా నిబంధనలను కఠిన తరం చేశారు. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా 2,68,833 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు గడిచిన 24 గంటల్లో 1,22,684 మంది కరోనా నుంచి… -
మూడో రోజు రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్.. బస్సులు సీజ్..
రవాణా శాఖ వారు సంక్రాంతి పండుగ వేళ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పండుగ వచ్చిదంటే ప్రైవేటు ట్రావెల్స్ టికెట్ ధరలకు రెక్కలు వస్తాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. ఎన్నిసార్లు జరిమానాలు విధించినా వినకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. దీంతో రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారు శంషాబాద్లో రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ మూడో రోజు నిర్వహించారు. బెంగుళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రత్యేక దాడులు చేశారు.… -
సంక్రాంతికి రిటర్న్ గిఫ్ట్.. కరోనా పాజిటివ్..?
సంక్రాంతి పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగువారింట సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి నేపథ్యంలో సంక్రాంతి పండుగను తెలుగువారు నామమాత్రంగానే జరుపుకున్నారు. అయితే మొన్నటి వరకు కరోనా రక్కసి తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలు ఈ ఏడాది సంక్రాంతి సంబరాలపై ఆసక్తిగా ఉన్నారు. ఇదే సమయంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. దీంతో మళ్లీ కరోనా కేసులు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే ఏపీలో సంక్రాంతి…
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..