భారత్ vs పాకిస్తాన్, భారత్ vs బంగ్లాదేశ్.. T20 World Cup 2026 Womens షెడ్యూల్ విడుదల!
- ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్..
- జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లాండ్ & వేల్స్లో
- గ్రూప్–1లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్
- గ్రూప్–2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్
- భారత్ తొలి మ్యాచ్ జూన్ 14న పాకిస్తాన్తో
- ఫైనల్ మ్యాచ్ జూలై 5న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026 Womens: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీ పూర్తి షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లాండ్ & వేల్స్లో జరిగే ఈ మహాసంగ్రామంలో మొత్తం 12 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ టోర్నీలో హోస్ట్ దేశం ఇంగ్లాండ్తో పాటు ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ ఇప్పటికే అర్హత సాధించాయి. క్వాలిఫయర్ టోర్నీ ద్వారా బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ జట్లు కూడా ప్రవేశం పొందాయి.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఈ మెగా టోర్నీలో గ్రూప్ వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రూప్–1: ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్.
గ్రూప్–2: ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్.
భారత్ మ్యాచ్లు ఎప్పుడు?
భారత్ తన తొలి మ్యాచ్ను జూన్ 14న ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్తాన్తో ఆడనుంది. జూన్ 17న నెదర్లాండ్స్తో హెడ్డింగ్లీ వేదికగా, జూన్ 21న దక్షిణాఫ్రికాతో ఓల్డ్ ట్రాఫోర్డ్లో, జూన్ 25న బంగ్లాదేశ్తో, జూన్ 28న లార్డ్స్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్ జూన్ 12న ఇంగ్లాండ్ – శ్రీలంక మధ్య ఎడ్జ్బాస్టన్లో జరుగుతుంది. సెమీఫైనల్స్ జూన్ 30, జూలై 2 తేదీల్లో ది ఓవల్లో నిర్వహించబడతాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 5న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది.
మినీ LED, 108W సౌండ్, Quantum డాట్ టెక్నాలజీతో Kodak 65 అంగుళాల IconiK Google TV భారత్లో లాంచ్..!
ఇక ఈ మహాసంగ్రామ షెడ్యూల్ ను ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ.. మహిళల క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ నిరంతర పెట్టుబడులు పెడుతోందని, ఈ టోర్నీ ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణను తీసుకువస్తుందని తెలిపారు. గత మహిళల వరల్డ్ కప్ విజయవంతంగా నిర్వహించబడిందని, అదే ఉత్సాహాన్ని ఈ టోర్నీలో కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?