Badulgula Lingaiah Yadav: నడ్డ సమాధి కట్టింది ప్రజలు టీఆర్ఎస్ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Badulgula Lingaiah Yadav: మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలానూ కాంగ్రెస్ గెలవడం సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ను గెలిపించాలని అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జేపీ నడ్డ సమాధి కట్టడం ప్రజలు చేశారని, టీఆర్ఎస్ కాదని ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ అన్నారు. మోటార్ల కు మీటర్లు పెట్టాలని చూస్తే విద్యుత్ ఉద్యోగులు తిరగబడే పరిస్తితి వచ్చిందని అన్నారు. టీఆర్ఎస్ లోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. బీసీ జనగణన చేయమని ఎన్నో సార్లు విన్నవించుకున్నమన్నారు. మునుగోడులో ఎక్కడికి వెళ్ళిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ పొంది పార్టీ మారి ఎలక్షన్ తెచ్చాడని ఆరోపించారు. అమ్ముడుపోయిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డీ అని తెలిపారు. ఎలానూ కాంగ్రెస్ గెలవడం సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ను గెలిపించాలని అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Jumble of revolvers: అసెంబ్లీ సమీపంలో రివాల్వర్ల కలకలం
Also Read
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
మోటార్ లకు మీటర్స్ పెడితే తప్పేంటి అంటాడు… బండి సంజయ్ మాత్రం మోటార్ లకు మీటర్లు పెట్టడం లేదు అంటాడు. కేసీఆర్ ఈ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని అన్నాడు. పోయిన సారి బీజేపీ కి డిపాజిట్ దక్క లేదని తెలిపారు. రాజకీయ పార్టీగా ఎన్నికలో గెలవాలని కోరుకుంటామన్నారు. బీజేపీ డబ్బుతో గెలవాలని చూస్తుందని, మొన్ననే బీజేపీ కార్యకర్త కోటి రూపాయలతో దొరికాడని ఎద్దేవ చేశారు. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో తినే అన్నాన్ని నోటి కాదా లాక్కుంది బీజేపీ అని ఆరోపించారు. టీఆర్ఎస్ అనేక పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ది చేకూరిందని తెలిపారు. బీజేపీ మాత్రం 400 ఉన్న గ్యాస్ ధరలను 1100 చేసిందని, ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేసింది బీజేపీనే అని అన్నారు. మునుగోడులో ఆఖరికి ఎన్నికల కమిషన్ ని కూడా వాడుకుంటుందని ఆరోపించారు. మునుగోడు ప్రజలు కేసీఆర్ని గెలిపించాలని ఫిక్స్ అయ్యారన్నారు. మాలాంటి బలహీన వర్గాలకు న్యాయం జరిగింది కేసీఆర్ నాయకత్వం లోనే అని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి బూర నర్సయ్య గౌడ్ ప్రలోభ పెట్టి చేర్చుకున్నారని అన్నారు. బలహీన వర్గాలను ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టాలని చూస్తుందని తెలిపారు. మోడీ.. కేసీఆర్ కు భయపడుతున్నాడని ఎద్దేవ చేశారు. బండి సంజయ్ ని గానీ బీజేపీ నాయకులను గానీ ప్రజలు పట్టించుకోరని తెలిపారు. బలహీన వర్గాలు అన్నికుడా టీఆర్ ఎస్ ని గెలిపిస్తాయని అన్నారు.
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ రవి చంద్ర మాట్లాడుతూ.. బీజేపీ పెట్టుకున్న కలలు అన్నీ బగ్నం కాబోతున్నాయని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో విద్యుత్ లేదు, కానీ మన దగ్గర 24 గంటల కరెంట్ ఇస్తున్నారని గుర్తు చేశారు. దేశప్రజలు కేసీఆర్ ని దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ ఎన్నిక కూడా బీఅర్ఎస్ అనుకూలంగా మారబోతోందని తెలిపారు. గిరిజన రిజర్వేషన్ ని 10శాతం పెంచి న్యాయం చేశారని అన్నారు. దళిత బందు దేశంలో ఎక్కడ లేని స్కీం అని గుర్తు చేశారు.
Bangladesh: వెరైటీ దొంగ.. పోలీసులకే ఫోన్ చేశాడు..ఎందుకంటే..
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!