K. Laxman: మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి.. కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరని BJP పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో TRS నాయకులు, శ్రేణులు కుంగిపోతున్నాయని అన్నారు. ఉద్యమ సమయంలో TRS రాజీనామాలు చేసి ఉద్యమానికి ఊపిరి పోసిందని అన్నారు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎందుకు దడ్చుకుంటుందని అన్నారు. దుబ్బాక, హుజురాబాద్ లో ప్రజా తీర్పుతో TRS పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వ్యక్తమైందని తెలిపారు. ఉద్యమానికి ఊపిరి పోసిన ఉప ఎన్నికలు.. ఇప్పుడు అవే ఎన్నికలు అంటే TRS నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవ చేశారు.
Read also: Munugode by poll: కోమటిరెడ్డిపై అభిమానం కమలం కొంప ముంచుతుందా?
Also Read
- Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
- Rythu Bharosa : రైతులకు గుడ్న్యూస్.. 5-6 ఎకరాలకు రైతు భరోసా జమ
- Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
- Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
మునుగోడులో మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు మకాం వేయాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. కుల, గ్రామాల వారీగా మద్యం, డబ్బులు పంచుతూ ప్రజా అభిప్రాయాన్ని కూడగట్టుకొనే ప్రయత్నం చేస్తోందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరని అన్నారు. మునుగోడు ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, పార్టీలు ప్రశ్నిస్తే కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరించారని అన్నారు. మునుగోడులో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని తెలిపారు. కేసీఆర్ అసహనంతో మునుగోడులో లబ్ది పొందేందుకు కొత్త మండలంతో పాటు గిరిజన బంధు ప్రకటించారని విమర్శించారు. కుల వృత్తులపైన ఆధారపడిన బీసీల ఫెడరేషన్, కార్పొరేషన్లకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని అన్నారు. ఓడిపోతామనే భయంతో తోక పార్టీలని విమర్శించిన కేసీఆర్ కమ్యూనిస్టులతో జత కట్టారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ దత్తతా తీసుకుంటనే అభివృద్ధి జరుగుతుందా? అంటూ ప్రశ్నించారు. TRS పార్టీ ఎమ్మెల్యేలు దద్దమ్మలా? అని లక్ష్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gulf oil Corporation: గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్కి షాక్.. ఆ స్థలం ఉదాసీన్ మఠం స్వాధీనం
తాజావార్తలు
-
Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
-
Iran: ఖమేనీ అంత్యక్రియల వేళ మొజ్తబాపై కొత్త పుకార్లు.. ఇరాన్లో చర్చోపచర్చలు
-
Ketan Agarwal murder: నా కూతురు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపలేదు: సియా తండ్రి వివరణ..
-
Varanasi: వారణాసిలో మహేష్ బాబు రాముడి లుక్ లీక్? నెట్టింట వైరల్ అవుతోన్న పిక్.. అసలు నిజం ఇదే!
-
Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..