K. Laxman: మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి.. కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరని BJP పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో TRS నాయకులు, శ్రేణులు కుంగిపోతున్నాయని అన్నారు. ఉద్యమ సమయంలో TRS రాజీనామాలు చేసి ఉద్యమానికి ఊపిరి పోసిందని అన్నారు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎందుకు దడ్చుకుంటుందని అన్నారు. దుబ్బాక, హుజురాబాద్ లో ప్రజా తీర్పుతో TRS పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వ్యక్తమైందని తెలిపారు. ఉద్యమానికి ఊపిరి పోసిన ఉప ఎన్నికలు.. ఇప్పుడు అవే ఎన్నికలు అంటే TRS నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవ చేశారు.
Read also: Munugode by poll: కోమటిరెడ్డిపై అభిమానం కమలం కొంప ముంచుతుందా?
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
మునుగోడులో మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు మకాం వేయాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. కుల, గ్రామాల వారీగా మద్యం, డబ్బులు పంచుతూ ప్రజా అభిప్రాయాన్ని కూడగట్టుకొనే ప్రయత్నం చేస్తోందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరని అన్నారు. మునుగోడు ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, పార్టీలు ప్రశ్నిస్తే కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరించారని అన్నారు. మునుగోడులో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని తెలిపారు. కేసీఆర్ అసహనంతో మునుగోడులో లబ్ది పొందేందుకు కొత్త మండలంతో పాటు గిరిజన బంధు ప్రకటించారని విమర్శించారు. కుల వృత్తులపైన ఆధారపడిన బీసీల ఫెడరేషన్, కార్పొరేషన్లకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని అన్నారు. ఓడిపోతామనే భయంతో తోక పార్టీలని విమర్శించిన కేసీఆర్ కమ్యూనిస్టులతో జత కట్టారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ దత్తతా తీసుకుంటనే అభివృద్ధి జరుగుతుందా? అంటూ ప్రశ్నించారు. TRS పార్టీ ఎమ్మెల్యేలు దద్దమ్మలా? అని లక్ష్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gulf oil Corporation: గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్కి షాక్.. ఆ స్థలం ఉదాసీన్ మఠం స్వాధీనం
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!