Komatireddy Venkat Reddy: నేడు ఆస్ట్రేలియాకు కాంగ్రెస్ ఎంపీ.. మునుగోడు ఎన్నిక తరువాతే ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎట్టకేలకు నేడు ఆస్ట్రేలియాకు బయలు దేరనున్నారు. మళ్లీ తిరిగి నవంబర్ 7న హైదరాబాద్ రానున్నారు. అయితే మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు షురూ కావడంతో రాజకీయం మరింతగా వేడెక్కింది. నువ్వా నేనా అన్నట్లుగా మునుగోడులో ప్రచారాల హోరు జరుగుతున్న నేపథ్యంలో.. ఈనెల (అక్టోబర్) 15న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబంతో ఆస్ట్రేలియా పర్యటన వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. తన తమ్ముడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరుపున బరిలో వుండి ప్రచారంలో పాల్గొంటే మరి తన సోదరుడికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయాలి. ఈనేపథ్యంలో మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ ప్రచారం ఓరేంజ్ లో పోటాపోటీ ప్రచారాలు జరుగుతాయని ఆశించిన వారందరికి నిరాశే ఎదురైందనే వార్తలకు కోమటిరెడ్డివెంకట్ రెడ్డి ఆ వార్తలను తిప్పి కొట్టారు. అది నా పర్సనల్ నేను నా కుటుంబంతో టూర్ వెళతానా లేదా అనేది అది నా ఇష్టం మునుగోడు ప్రచారానికి వీఐపీలు వెళతారు.. హోంగార్డులతో పనిలేదని రేవంత్ కు చురకలంటించారు.
Read also: Allu Aravind: ఆయన తిడతాడేమోనని ముందే చూపించాను : అల్లు అరవింద్
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
అయితే అక్టోబర్ 15ను కాకుండా ఇవాళ(21)న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన కుటుంబంతో సహా టూర్ వెళ్లనున్నారు. మళ్లీ ఆయన తిరిగి మునుగోడు ఎన్నిక తరువాతే.. అంటే నవంబర్ 7న రానున్నారు. అయితే.. నవంబర్ 3న ఎన్నిక…నవంబర్ 6న కౌంటింగ్ జరగనుంది. మునుగోడులో కాంగ్రెస్ బలం పుంజుకునేందుకు హోరా హోరీగా ఎన్నిక ప్రచారం జరుగుతుండగా కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉండి తన తమ్ముడు బీజేపీలో చేరడంతో.. కాంగ్రెస్లో అన్న వుండి ఎటువంటి ప్రచారం చేయకపోవడం పై సర్వత్రా విమర్శలు దారితీస్తున్నాయి. తమ్మడు కోసం అన్న త్యాగమా? ఎటువంటిదైనా సరే ఏ పార్టీలో వున్నా వారి తరుపున ప్రచారంలో సీనియర్లు పాల్గొని వారి పార్టీకోసం ప్రచారం చేయాల్సింది పోయి ఇలా టూర్ అంటూ వారి కుటుంబ సభ్యులతో వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టూర్ అనేది వ్యక్తిగత విషయం అయినా తమ్మడు కోసం అన్న త్యాగమా? ఇరు పార్టీలు వేరు వేరు అయినా రక్తం ఒక్కటే కాదా అంటూ విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి తరుపున రేవంత్ రెడ్డి మునుగోడులో ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిన్న గుర్రంమీద ఎక్కి సవారి చేస్తూ ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్, బీజేపీ పై విమర్శలు చేస్తూ మునుగోడులో హస్తం జెండాను ఎగరవేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టూర్ కాంగ్రెస్ నాయకులకు గట్టిదెబ్బే అన్నట్లు తెలుస్తోంది.
Chad: చాద్లో దారుణం.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో కాల్పులు..60 మంది మృతి
తాజావార్తలు
-
Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. సెలెక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!