Komatireddy Venkat Reddy: నేడు ఆస్ట్రేలియాకు కాంగ్రెస్ ఎంపీ.. మునుగోడు ఎన్నిక తరువాతే ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎట్టకేలకు నేడు ఆస్ట్రేలియాకు బయలు దేరనున్నారు. మళ్లీ తిరిగి నవంబర్ 7న హైదరాబాద్ రానున్నారు. అయితే మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు షురూ కావడంతో రాజకీయం మరింతగా వేడెక్కింది. నువ్వా నేనా అన్నట్లుగా మునుగోడులో ప్రచారాల హోరు జరుగుతున్న నేపథ్యంలో.. ఈనెల (అక్టోబర్) 15న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబంతో ఆస్ట్రేలియా పర్యటన వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. తన తమ్ముడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరుపున బరిలో వుండి ప్రచారంలో పాల్గొంటే మరి తన సోదరుడికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయాలి. ఈనేపథ్యంలో మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ ప్రచారం ఓరేంజ్ లో పోటాపోటీ ప్రచారాలు జరుగుతాయని ఆశించిన వారందరికి నిరాశే ఎదురైందనే వార్తలకు కోమటిరెడ్డివెంకట్ రెడ్డి ఆ వార్తలను తిప్పి కొట్టారు. అది నా పర్సనల్ నేను నా కుటుంబంతో టూర్ వెళతానా లేదా అనేది అది నా ఇష్టం మునుగోడు ప్రచారానికి వీఐపీలు వెళతారు.. హోంగార్డులతో పనిలేదని రేవంత్ కు చురకలంటించారు.
Read also: Allu Aravind: ఆయన తిడతాడేమోనని ముందే చూపించాను : అల్లు అరవింద్
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
అయితే అక్టోబర్ 15ను కాకుండా ఇవాళ(21)న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన కుటుంబంతో సహా టూర్ వెళ్లనున్నారు. మళ్లీ ఆయన తిరిగి మునుగోడు ఎన్నిక తరువాతే.. అంటే నవంబర్ 7న రానున్నారు. అయితే.. నవంబర్ 3న ఎన్నిక…నవంబర్ 6న కౌంటింగ్ జరగనుంది. మునుగోడులో కాంగ్రెస్ బలం పుంజుకునేందుకు హోరా హోరీగా ఎన్నిక ప్రచారం జరుగుతుండగా కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉండి తన తమ్ముడు బీజేపీలో చేరడంతో.. కాంగ్రెస్లో అన్న వుండి ఎటువంటి ప్రచారం చేయకపోవడం పై సర్వత్రా విమర్శలు దారితీస్తున్నాయి. తమ్మడు కోసం అన్న త్యాగమా? ఎటువంటిదైనా సరే ఏ పార్టీలో వున్నా వారి తరుపున ప్రచారంలో సీనియర్లు పాల్గొని వారి పార్టీకోసం ప్రచారం చేయాల్సింది పోయి ఇలా టూర్ అంటూ వారి కుటుంబ సభ్యులతో వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టూర్ అనేది వ్యక్తిగత విషయం అయినా తమ్మడు కోసం అన్న త్యాగమా? ఇరు పార్టీలు వేరు వేరు అయినా రక్తం ఒక్కటే కాదా అంటూ విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి తరుపున రేవంత్ రెడ్డి మునుగోడులో ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిన్న గుర్రంమీద ఎక్కి సవారి చేస్తూ ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్, బీజేపీ పై విమర్శలు చేస్తూ మునుగోడులో హస్తం జెండాను ఎగరవేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టూర్ కాంగ్రెస్ నాయకులకు గట్టిదెబ్బే అన్నట్లు తెలుస్తోంది.
Chad: చాద్లో దారుణం.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో కాల్పులు..60 మంది మృతి
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!