KTR : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, పీఆర్సీ అమలు , పెండింగ్ డీఏల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యాన్ని ఆయన ఎండగట్టారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పీఆర్సీ వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేటికీ ఆ దిశగా అడుగులు వేయకపోవడం ఉద్యోగ వర్గాలను వంచించడమేనని ఆయన విమర్శించారు. పీఆర్సీ గడువు…
శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. గత పదేళ్లలో గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలు విస్తృతంగా వ్యాపించాయని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధులందరూ డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాను డ్రగ్ టెస్టుకు సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువస్తానని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
KTR: తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాష్ట్ర కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలకు ఇప్పటివరకు చట్టబద్ధత కల్పించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని గతంలో గవర్నర్ ప్రసంగంలో చెప్పించినప్పటికీ ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎలాంటి చట్టబద్ధత లేదని కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై రాబోయే…
KTR : రాష్ట్ర రాజకీయాల్లో డ్రగ్స్ అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీటుగా స్పందించారు. తనపై వస్తున్న అనుమానాలను పటాపంచలు చేసేందుకు ఎలాంటి పరీక్షలకైనా తాను సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలని, ఆయనకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలంటూ మహేశ్ గౌడ్ చేసిన సూచనను కేటీఆర్ స్వాగతించారు.…
మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ‘మింగడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేసిన ఆయన, రాష్ట్ర ఖజానాలో ప్రజా హామీలకే నిధులు లేనప్పుడు మూసీ ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. గతంలో కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ నిర్మాణం గురించి ప్రెజెంటేషన్ ఇస్తే,…
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూసి నది శుద్ధి, నగరాభివృద్ధి, పేదల ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూసి నదిని శుభ్రపరచడం కోసం తమ ప్రభుత్వం ఉన్న సమయంలో 32 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. మూసిలోకి వచ్చే ప్రతి నీటి చుక్కను శుద్ధి చేయాలన్నదే తమ ఆలోచన అని అన్నారు. Rajya Sabha…
KTR: మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా? అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ ట్వీట్ చేశారు. నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరమని పేర్కొన్నారు. బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "ఏకంగా…
ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు క్లీన్ షీట్ ఇచ్చిన వేళ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీ నాయకత్వంపై యుద్ధం ప్రకటించారు. లిక్కర్ కేసు కారణంగానే బీఆర్ఎస్ రెండు ఎన్నికల్లో ఓడిపోయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ ఓటమికి బాధ్యతను తన మీదకు తోసేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ, అసలు ఓటమికి దారితీసిన పరిస్థితులను బహిరంగంగా విశ్లేషించారు. లిక్కర్ కేసు వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న వాదనలో అసలు లాజిక్ లేదని…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు నుంచి క్లీన్ షీట్ లభించిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు తనకు శుభాకాంక్షలు చెబుతూనే, మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణమని కేటీఆర్ ట్వీట్ చేయడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమిని తన మెడకు చుట్టాలని చూడటం సరికాదని హితవు పలికిన కవిత, అసలు తనపై ఈ కేసు పెట్టింది…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వెలువడిన తాజా తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ (X) వేదికగా తీవ్రంగా స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, అలాగే బీఆర్ఎస్ నాయకులను బద్నాం చేయడానికి ఈ అక్రమ కేసును సృష్టించారని ఆయన మండిపడ్డారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని కేటీఆర్ విమర్శించారు. కేవలం రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఈ కథనాన్ని అల్లారని, దీనివల్ల అసెంబ్లీ, పార్లమెంట్…