KTR : ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు.. మహామహులనే ప్రజలు ఓడించారు..!
- సీఎం రేవంత్ శైలిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- మహామహులనైనా ప్రజలు ఓడించారన్న ఉదాహరణలు
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాజీనామా సవాల్
- మున్సిపల్ ఫలితాలు కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనం
KTR : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి శైలిని విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనను తాను ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని విర్రవీగుతున్నారని, చరిత్రలో ఇలాంటి వారు ఎందరో వచ్చారని ఆయన మండిపడ్డారు.
ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేయడం మూర్ఖత్వమని కేటీఆర్ హెచ్చరించారు. గతంలో ఇందిరా గాంధీ, ఎన్టీ రామారావు వంటి మహామహులనే ప్రజలు ఓడించారని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కూడా కామారెడ్డిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వారు గాలిలో కలిసిపోయారే తప్ప దేశం, ప్రజల చైతన్యం మాత్రం అలాగే ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
అదిరింది.. 36 వేలకే 5 Star 1.5 Ton AC.. Summer రాకముందే అదిరిపోయే Gift..!
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కేటీఆర్ రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. “మీ ప్రభుత్వం మీద మీకు అంత నమ్మకం ఉంటే, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లండి” అని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచినట్లు గొప్పలు చెప్పుకోవడం కాదని, రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపాలని సవాల్ విసిరారు. ఆ 10 చోట్ల ఉప ఎన్నికలు జరిగితేనే అది నిజమైన ప్రజాభిప్రాయానికి కొలమానం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత మున్సిపల్ ఫలితాలను విశ్లేషిస్తూ, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 130 మున్సిపాలిటీలకు గాను 122 గెలిచామని కేటీఆర్ తెలిపారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా 116 స్థానాల్లో 15-16 చోట్లలో బీఆర్ఎస్ గెలిచిందని, దాదాపు 30 చోట్ల హంగ్ ఏర్పడిందని వివరించారు. ఇది ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, ప్రజల పక్షాన పోరాడుతున్నందునే బీఆర్ఎస్కు మద్దతు లభిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Flat 31% Discount : భారతదేశపు మొట్టమొదటి అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్పై భారీ డీల్..!
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!