KTR : ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు.. మహామహులనే ప్రజలు ఓడించారు..!
- సీఎం రేవంత్ శైలిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- మహామహులనైనా ప్రజలు ఓడించారన్న ఉదాహరణలు
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాజీనామా సవాల్
- మున్సిపల్ ఫలితాలు కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి శైలిని విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనను తాను ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని విర్రవీగుతున్నారని, చరిత్రలో ఇలాంటి వారు ఎందరో వచ్చారని ఆయన మండిపడ్డారు.
ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేయడం మూర్ఖత్వమని కేటీఆర్ హెచ్చరించారు. గతంలో ఇందిరా గాంధీ, ఎన్టీ రామారావు వంటి మహామహులనే ప్రజలు ఓడించారని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కూడా కామారెడ్డిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వారు గాలిలో కలిసిపోయారే తప్ప దేశం, ప్రజల చైతన్యం మాత్రం అలాగే ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read
అదిరింది.. 36 వేలకే 5 Star 1.5 Ton AC.. Summer రాకముందే అదిరిపోయే Gift..!
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కేటీఆర్ రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. “మీ ప్రభుత్వం మీద మీకు అంత నమ్మకం ఉంటే, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లండి” అని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచినట్లు గొప్పలు చెప్పుకోవడం కాదని, రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపాలని సవాల్ విసిరారు. ఆ 10 చోట్ల ఉప ఎన్నికలు జరిగితేనే అది నిజమైన ప్రజాభిప్రాయానికి కొలమానం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత మున్సిపల్ ఫలితాలను విశ్లేషిస్తూ, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 130 మున్సిపాలిటీలకు గాను 122 గెలిచామని కేటీఆర్ తెలిపారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా 116 స్థానాల్లో 15-16 చోట్లలో బీఆర్ఎస్ గెలిచిందని, దాదాపు 30 చోట్ల హంగ్ ఏర్పడిందని వివరించారు. ఇది ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, ప్రజల పక్షాన పోరాడుతున్నందునే బీఆర్ఎస్కు మద్దతు లభిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Flat 31% Discount : భారతదేశపు మొట్టమొదటి అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్పై భారీ డీల్..!
తాజావార్తలు
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
-
Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!