KTR : ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు.. మహామహులనే ప్రజలు ఓడించారు..!
- సీఎం రేవంత్ శైలిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- మహామహులనైనా ప్రజలు ఓడించారన్న ఉదాహరణలు
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాజీనామా సవాల్
- మున్సిపల్ ఫలితాలు కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి శైలిని విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనను తాను ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని విర్రవీగుతున్నారని, చరిత్రలో ఇలాంటి వారు ఎందరో వచ్చారని ఆయన మండిపడ్డారు.
ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేయడం మూర్ఖత్వమని కేటీఆర్ హెచ్చరించారు. గతంలో ఇందిరా గాంధీ, ఎన్టీ రామారావు వంటి మహామహులనే ప్రజలు ఓడించారని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కూడా కామారెడ్డిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వారు గాలిలో కలిసిపోయారే తప్ప దేశం, ప్రజల చైతన్యం మాత్రం అలాగే ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
- Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
అదిరింది.. 36 వేలకే 5 Star 1.5 Ton AC.. Summer రాకముందే అదిరిపోయే Gift..!
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కేటీఆర్ రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. “మీ ప్రభుత్వం మీద మీకు అంత నమ్మకం ఉంటే, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లండి” అని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచినట్లు గొప్పలు చెప్పుకోవడం కాదని, రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపాలని సవాల్ విసిరారు. ఆ 10 చోట్ల ఉప ఎన్నికలు జరిగితేనే అది నిజమైన ప్రజాభిప్రాయానికి కొలమానం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత మున్సిపల్ ఫలితాలను విశ్లేషిస్తూ, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 130 మున్సిపాలిటీలకు గాను 122 గెలిచామని కేటీఆర్ తెలిపారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా 116 స్థానాల్లో 15-16 చోట్లలో బీఆర్ఎస్ గెలిచిందని, దాదాపు 30 చోట్ల హంగ్ ఏర్పడిందని వివరించారు. ఇది ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, ప్రజల పక్షాన పోరాడుతున్నందునే బీఆర్ఎస్కు మద్దతు లభిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Flat 31% Discount : భారతదేశపు మొట్టమొదటి అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్పై భారీ డీల్..!
తాజావార్తలు
-
Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద
-
Ansiba Hassan: ‘జిహాదీ’ అంటూ వేధించారు.. మలయాళ నటి షాకింగ్ కామెంట్స్
-
KTR: “మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి”.. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
-
Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. “జాఫర్ ఎక్స్ప్రెస్”నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
-
Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?