హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ విడుదల.. జాబితాలో కొత్తగా భారత్ నుంచి 57 మంది కోటీశ్వరులు..
- హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 నివేదిక వెల్లడి..
- భారత్ నుంచి పెరిగిన కోటీశ్వరుల సంఖ్య..
- ప్రపంచవ్యాప్తంగా జాబితాలో 4020 మంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026’ నివేదిక వెల్లడైంది. ఈ ఏడాది మన భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య బాగా పెరిగింది. నివేదిక ప్రకారం.. ఈసారి మన దేశంలో కొత్తగా 57 మంది కోటీశ్వరులు చేరారు. దీంతో మొత్తం సంఖ్య 308కి చేరింది. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా కోటీశ్వరులు ఉన్న మూడవ దేశంగా భారత్ నిలిచింది. మన దేశంలోని ఈ కోటీశ్వరులందరి ఆస్తి విలువ కలిపి సుమారు 112 లక్షల కోట్ల రూపాయలు.
ధనవంతుల జాబితాలో ఎవరు ముందున్నారు..?
ముఖేష్ అంబానీ: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ ఏడాది కూడా ఇండియాలోనే అత్యంత ధనవంతుడిగా, ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన ఆస్తి 9.8 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది.
Also Read
- Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
గౌతమ్ అదానీ: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 7.5 లక్షల కోట్ల రూపాయల ఆస్తితో రెండవ స్థానంలో ఉన్నారు.
రోష్ని నాడార్: హెచ్సిఎల్ సంస్థకు చెందిన రోష్ని నాడార్ మల్హోత్రా 3.2 లక్షల కోట్ల రూపాయల ఆస్తితో మూడవ స్థానంలో నిలిచారు. టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళ ఆమెనే.
Also Read:Discounts On Gold: బంగారంపై భారీ డిస్కౌంట్లు.. భలే అవకాశం.. త్వరపడండి..
సైరస్ పూనావాలా: సీరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా 44 శాతం ఆస్తి పెంచుకుని.. 3 లక్షల కోట్ల రూపాయలతో నాలుగవ స్థానానికి చేరుకున్నారు.
ఇండియాలో కోటీశ్వరులకు అడ్డా అంటే ఇప్పటికీ ముంబైనే. ముంబైలో 95 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఈ ఏడాది ముంబైలో కొత్తగా 15 మంది కోటీశ్వరులు వచ్చి చేరారు.
ఏ రంగాల్లో కోటీశ్వరులు పెరుగుతున్నారు..?
హెల్త్కేర్ (ఆరోగ్య రంగం)లో కొత్తగా 53 మంది కోటీశ్వరులు వచ్చారు. ఆ తర్వాత పారిశ్రామిక ఉత్పత్తులు, వినియోగ వస్తువుల రంగాల్లో కూడా మంచి వృద్ధి కనిపిస్తోంది. చిన్న వయసులోనే ఆస్తిని సంపాదించిన వారిలో ఓయో (OYO) వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (32 ఏళ్లు) ఒకరు. ఆయన ఆస్తి 14,440 కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరుల సంఖ్య తొలిసారిగా 4,000 దాటి 4,020కి చేరుకుంది. ఎలాన్ మస్క్ తన సంపదను ఏకంగా 89 శాతం పెంచుకుని, 792 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
Also Read:Kapil Dev: అభిషేక్ శర్మ బ్యాటింగ్పై.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు..
ఒకప్పుడు ఈ జాబితాలో ఉన్నవారిలో 80 శాతం మంది 10 ఏళ్ల క్రితం అసలు లేరంటే.. మన దేశంలో వ్యాపారాలు, సంపద సృష్టించే మార్గాలు ఎంత వేగంగా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మన దేశం ఇలాగే ముందుకు వెళ్తే.. త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుతుందని ఈ నివేదిక చెబుతోంది.
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!