కోలీవుడ్ సూపర్ స్టార్, తలపతి విజయ్ పలు వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తన రోల్స్ రాయిస్ కారు పన్ను విషయంలో ఆయన చర్చనీయాంశం అయ్యారు. తాజాగా తల్లిదండ్రులతో పాటు ఇంకొంతమందిపై విజయ్ కేసు పెట్టడం తమిళనాట సంచలనంగా మారింది. కోలీవుడ్ లో విజయ్ కు అశేషమైన ప్రజాదరణ ఉన్న విషయం తెలిసిందే. అయితే తన అభిమానులను, తన పేరును తండ్రి రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకోవద్దు అంటూ ఇంతకుముందు విజయ్ హెచ్చరించారు. తాజాగా విజయ్…
తలపతి విజయ్ రోల్స్ రాయిస్ ట్యాక్స్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. 2012 లో విజయ్ ఖరీదైన లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్ను లండన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. కస్టమ్ డ్యూటీగా దిగుమతి చేసుకోవడానికి అతను పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాడు. అన్ని పన్నులు, ఛార్జీలను చెల్లించాడు. కానీ నిబంధనల ప్రకారం ఉన్న ఎంట్రీ ట్యాక్స్ నుండి మాత్రం మినహాయింపుని కోరాడు. దీనిపై అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో కోర్టులో కేసు వేశాడు. ప్రవేశ పన్ను మినహాయింపుకు…
కరోనా కారణంగా గత యేడాది, ఈ సంవత్సరం చిత్రసీమలో షూటింగ్స్ కాస్తంత తగ్గుముఖం పట్టినా హీరో విశాల్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. కరోనా టైమ్ లోనే ‘ఎనిమి’ సినిమా షూటింగ్ ను ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి మాగ్జిమమ్ షూటింగ్ ఫిల్మ్ సిటీలోనే పూర్తి చేసేశాడు విశాల్. తమిళ క్రేజీ స్టార్ ఆర్య కీలక పాత్ర పోషించిన ‘ఎనిమి’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ఈ వారంలోనే మొదలై ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. డబ్బింగ్ థియేటర్ కు…
తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “బీస్ట్”. ఈ మూవీలో మరో కోలీవుడ్ హీరో ధనుష్ కూడా భాగం కాబోతున్నాడట. ఇదే విషయంపై ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ చర్చ నడుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో భాగం కావడం అనే వార్త అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా ధనుష్ గురించి కూడా. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన “సూరారై పొట్రు” తెలుగులో “ఆకాశం నీ హద్దురా” అనే టైటిల్ తో విడుదలైన విషయం తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. డైరెక్ట్ ఓటిటిలో ఈ మూవీని రిలీజ్ చేసినప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాదు ‘ఆస్కార్’ రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంది. ఎన్నో రికార్డులు సృష్టించి విమర్శకులతో…
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం “పొన్నియిన్ సెల్వన్” సెట్లో ఇటీవల ఓ గుర్రం మరణించింది. తాజా మీడియా కథనాల ప్రకారం అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో మణిరత్నం నిర్మాత సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్, గుర్రం యజమాని అయిన హైదరాబాదీ వ్యక్తిపై పెటా ఇండియా ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు పిసిఎ చట్టం సెక్షన్ 429, ఐపిసి 1960 సెక్షన్ 111860 కింద కేసు…
కోలీవుడ్లోని ప్రముఖ నటీమణులలో జ్యోతిక ఒకరు. స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె సందేశాత్మకమైన సామాజిక సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. అయితే ఆమె సోషల్ మీడియాకు మాత్రం దూరంగానే ఉన్నారు. దీంతో జ్యోతిక ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ సరిగ్గా లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధిలో భాగంగా సోషల్ మీడియా అనేది ప్రజల జీవితాల్లో ఒకటిగా మారిపోయింది. సెలెబ్రిటీలు సైతం ఎలాంటి సమస్యా లేకుండా…
సౌత్ లో భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. తాజాగా ఆయన సరికొత్త రికార్డును సెట్ చేశారు. ఓకే నెలలో ఆయన నటించిన 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీనితో సెప్టెంబర్ లో ఓటిటి వేదికగా ఈ రికార్డు నమోదు కాబోతోంది. శృతి హాసన్, సేతుపతి జంటగా నటించిన “లాభం” చిత్రం సెప్టెంబర్ 9 న నెట్ఫ్లిక్స్లో విడుదలవుతోంది. అదే నెలలో 11న “తుగ్లక్ దర్బార్”, 17న “అన్నాబెల్లె సేతుపతి” 24న “కడై…
లేడీ సూపర్స్టార్ నయనతార ఇటీవలే ప్రైవేట్ వేడుకలో తన ప్రియుడు, దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఎంగేజ్మెంట్ అయిపోయినట్టుగా ప్రకటించి వార్తల్లో నిలిచింది. తాజాగా మరోమారు ఆమె ఓ బేబీని ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార, విగ్నేష్ శివన్ ఇద్దరూ కలిసి ఉండగా, నయన్ బేబీని ఎత్తుకుంది. దాంతో అసలు ఆ బేబి ఎవరు అనే ప్రశ్న అభిమానులను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఆమె అభిమానులు ఈ బేబీ ఎవరై ఉంటారబ్బా !? అనే…
తమిళ హీరో శింబుకు ఊరట కల్పించింది నిర్మాతల మండలి. ఈ హీరో కెరీర్ ప్రారంభం నుండి వివాదాలలో చిక్కుకుంటూనే ఉన్నాడు. కొంతమంది నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో ఆయన గొడవ చివరికి తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వరకూ చేరుకొని అక్కడ నుండి రెడ్ కార్డ్ నిషేధానికి దారి తీసింది. గతంలో శింబు ప్రధాన పాత్రలో “అన్బాధవన్ అసరదావన్ అడంగాదవన్” అనే సినిమా సమయంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాను తెరకెక్కించిన నిర్మాత మైఖేల్ రాయప్పన్…