‘సూరరై పోట్రు’తో మరోసారి బౌన్స్ బ్యాక్ అయిన సూర్య మంచి జోష్ లో ఉన్నాడు. కెరీర్ మొదట్నుంచీ ప్రయోగాలకు సై అనే టాలెంటెడ్ హీరో ఈసారి గిరిజన మహిళలపై దృష్టి పెట్టాడట. ‘జై భీమ్’ పేరుతో ఆయన నటిస్తోన్న సినిమాలో 1993 నాటి యదార్థ సంఘటనలు తెరపై కనిపించబోతున్నాయట. చంద్రు అనే లాయర్ చేసిన న్యాయ పోరాటం, దాని వల్ల అమాయక, పేద గిరిజన మహిళలకు కలిగిన లాభం సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారట. ‘సూరరై పోట్రు’ కూడా…
కోలీవుడ్ లో దర్శకుడిగానే కాక హీరోగా కూడా సత్తా చాటుతోన్న సుందరాంగుడు.. సుందర్ సి. ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. డైరెక్టర్ గా 30 చిత్రాలు పూర్తి చేసినప్పటికీ హీరోగా ఆచితూచి సినిమాలు సైన్ చేస్తుంటాడు. ప్రస్తుతం సుందర్ ‘అరన్మణై 3’ సీక్వెల్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే, డైరెక్టర్ గానే ఈసారి హీరోగా కూడా కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు టాలెంటెడ్ స్టార్… సుందర్ హీరోగా 2006లో విడుదలైంది…
ఇప్పుడు ఏ సినిమా రంగంలో చూసినా సీక్వెల్స్ జోరు నడుస్తోంది. ఒక్క సినిమా హిట్టైతే చాలు దానికి సీక్వెల్స్ అంటూ వీలైనన్ని మూవీస్ ని వండి వడ్డించేస్తున్నారు. తమిళంలోనూ సేమ్ ట్రెండ్ సాగుతోంది…థ్రిల్లర్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే డిఫరెంట్ డైరెక్టర్ మిస్కిన్. ఆయన గత చిత్రం ఉదయనిధి స్టాలిన్ నటించిన ‘సైకో’. నిత్యా మీనన్, అదితి రావ్ హైదరీ హీరోయిన్స్ గా కనిపించారు. అయితే, ‘సైకో’ మూవీకి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. అందుకే,…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పాత్ర కోసం ప్రాణం పెట్టే మనిషి. కెరీర్ ప్రారంభం నుండి అతను చేసిన సినిమాలను గమనిస్తే ఆ విషయం అర్థమౌతుంది. తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగించడం కోసం సూర్య ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు. మేకప్ పరంగానూ, టెక్నాలజీ సాయంతోనూ వెండితెర మీద భిన్నంగా కనిపించడమే కాదు… స్వయంగా కష్టపడి కూడా తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి సూర్య తపిస్తుంటాడు. త్వరలోనే సూర్య నటించిన వెబ్ సీరిస్ ‘నవరస’…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్కి మద్రాస్ హైకోర్టు లక్ష రూపాయల జరిమానాతో షాకిచ్చింది. విజయ్ రోల్స్ రాయిస్ గోస్ట్ అనే రూ.8 కోట్ల ఖరీదైన కారును 2012లో ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారుకు దాదాపు రూ.1.6 కోట్లను పన్నుగా చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హీరో విజయ్ 2021లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, విజయ్ పిటిషన్ ను జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియమ్ తోసిపుచ్చారు.…
‘బాయ్స్’ సినిమాతో హీరో అయిన సిద్ధార్థ్ కోలీవుడ్ లో ఎంత పేరున్న నటుడో టాలీవుడ్ లోనూ అంతే పాప్యులర్. అయితే, ఒక దశలో తెలుగులోనూ డైరెక్ట్ చిత్రాలు చేస్తూ యమ బిజీగా ఉన్న ‘బొమ్మరిల్లు’ స్టార్ గ్రహాలు కలసి రాకో, స్వయంకృతాపరాధం వల్లో బాగా వెనుకబడ్డాడు. తమిళంలో ఈ ‘హ్యాండ్సమ్ పయ్యన్’ పరిస్థితి ఫర్లేదు అన్నట్టుగానే కొనసాగుతూ వస్తోంది. కాకపోతే, ఈ మధ్య కాలంలో మన లవర్ బాయ్ కి మరోసారి టైమొచ్చినట్టు కనిపిస్తోంది! 2019లో ‘అరువమ్’…
‘’ఎప్పుడో 30 ఏళ్ల కిందట మేం చేసిన చిత్రాలు చూసి ఆశ్చర్యపోవటం కాదు… ఇప్పుడు ఇక ఈ తరం ఫిల్మ్ మేకర్స్ తమవైన అద్భుత చిత్రాలు రూపొందించాలి!’’ అంటున్నాడు కమల్ హాసన్. ‘ప్రేమమ్’ సినిమా దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ ఆ మధ్య కమల్ హాసన్ ‘దశావతారం’ ట్వీట్ కు స్పందించాడు. 13 ఏళ్లు పూర్తయ్యాయంటూ కమల్ ‘దశావతారం’ సినిమాని గుర్తు చేసుకోగా… డైరెక్టర్ అల్ఫోన్స్ ఆ సినిమాని ‘పీహెచ్ డీ’తో పోల్చాడు. అయితే, ‘దశావతారం’ పీహెచ్డీ కాగా…
సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రదర్శనలకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సి.బి.ఎఫ్.సి) జారీ చేసే ధ్రువపత్రాల అధికారం.. కేంద్రం అధీనంలోకి తీసుకుంటూ చట్టాన్ని రూపొందించాలన్న నిర్ణయంపై సినీ పరిశ్రమలో అసంతృప్తి రగులుతోంది. దీనిపై సినిమా ప్రముఖులు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే దీనిపై తమిళ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా స్పందించారు. ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.…
కాంట్రవర్సీ ‘క్వీన్’ కంగనాకి కోర్టు కష్టాలు తప్పటం లేదు. ప్రతీ రోజూ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేసే ముక్కుసూటి ముద్దుగుమ్మ ఇప్పుడు కాపీరైట్ కొట్లాటలో ఇరుక్కుంది. తాను ‘మణికర్ణిక రిటర్న్స్ : ద లెజెండ్ ఆఫ్ దిడ్డా’ పేరుతో సినిమా చేయబోతున్నట్టు కొన్నాళ్ల కింద కంగనా ట్వీట్ చేసింది. అయితే, తన పర్మిషన్ లేకుండా తన పుస్తకంలోని కథని వాడుకుంటున్నారని ఆశిష్ కౌల్ అనే రచయిత కోర్టుకు వెళ్లాడు. ఆయన కంగనాకి ఒక మెయిల్ చేయగా… అందులోని…
ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్యర్య వివాహం నేడు ఘనంగా జరుగుతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్తో కలిసి ఆమె కాసేపటి క్రితమే ఏడడుగులు వేసింది. కరోనా కారణంగా మహాబలిపురంలో వీరి వివాహ వేడుకను నిరాడంబరం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై.. నూతన వధువరులను ఆశీర్వాదించారు. ఈమేరకు వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…