ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉత్తరకొరియాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా అణ్వాయుధాలను విడనాడాలని నొక్కిచెప్పారు. రెండు దేశాల మధ్య జరిగిన సమావేశం అప్పట్లలో అర్థాంతరంగా ముగిసింది. ఆ తరువాత కూడా కిమ్తో ట్రంప్ టచ్లోనే ఉన్నారు. అణ్వాయుధాలను విడనాడే విధంగా చేసుందుకు ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు. అంతలోనే ఎన్నికలు రావడం, ట్రంప్ ఓడిపోవడంతో ఆయన మాజీ అయిపోయారు. Read: Ukraine…
ఉత్తర కొరియా గత దశాబ్దకాలంగా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఆయుధాలను తయారు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సొంతంగా క్షిపణులను తయారు చేసుకుంటూ దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలను భయపెడుతున్నది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఏ క్షపణిని ప్రయోగిస్తారో తెలియక చుట్టుపక్కల దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్తర కొరియా సముద్రంలోని అల్సామ్ దీవుల్లో ఓ పెద్ద రాయి ఉన్నది. దీనిని ఉత్తర కొరియా మోస్ట్ హేటెట్ రాక్ అని పిలుస్తారు. దీనిని టార్గెట్…
దేశంలోని ప్రజల కోసం ఒకవైపు ఆహారాన్ని సమకూర్చుకుంటూనే, మరోవైపు క్షిపణీ ప్రయోగాలు చేస్తున్నది ఉత్తర కొరియా. 2022 జనవరిలో ఇప్పటి వరకు మొత్తం 7 క్షిపణీ ప్రయోగాలు చేపట్టింది. ఆదివారం ఉదయం సమయంలో ఉత్తర కొరియా భారీ క్షిపణిని ప్రయోగించి షాకిచ్చింది. ఇప్పటి వరకు స్వల్పశ్రేణి క్షిపణుల ప్రయోగాలు చేసిన ఉత్తర కొరియా 2017 తరువాత మరోసారి భారీ క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి భూమినుంచి 2000 కిమీ ఎత్తుకు చేరుకొని అక్కడి నుంచి జపాన్ సముద్రంలో…
కరోనా కారణంగా మార్చి 2020 నుంచి ఉత్తర కొరియా తన సరిహద్దులను మూసివేసింది. దీంతో చైనాతో వాణిస్య సంబంధాలు చాలా వరకు నిలిచిపోయాయి. కఠినమైన నిబంధనలు అమలు చేస్తుండటంతో ఉత్తర కొరియాలోకి కరోనా మహమ్మారి ఎంటర్ కాలేదు. రెండేళ్లుగా ఆ దేశంలోని ప్రజలు ఆహారం కొరతతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడు కిమ్ అనుసరిస్తున్న విధానాలు, అణ్వస్త్ర క్షిపణుల ప్రయోగాల కారణంగా ప్రపంచదేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
ప్రపంచంలోని అందరిదీ ఒక దారైతే, ఉత్తర కొరియాది మరోదారి. ఆదాయం కోసం ఆ దేశం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ప్రపంచమంతా కరోనా నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే నార్త్ కొరియా మాత్రం క్షిపణీ ప్రయోగాలతో బిజీగా మారింది. మరోవైపు ఆ దేశం హ్యాకర్లను ప్రోత్సహిస్తూ ప్రపంచ సంపదను కొల్లగొడుతోంది. ఇప్పుడు ఎవరి నియంత్రణలో లేని బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రూపొందిన క్రిఫ్టోకరెన్సీపై నార్త్ కొరియా కన్నేసింది. క్రిఫ్టో కరెన్సీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నవారిపై హ్యాకర్లు దృష్టి…
ఉత్తర కొరియా అధ్యక్షుడు మళ్లీ పాతపద్దతికే వచ్చేశారు. అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తైన సందర్భంగా కాస్త తగ్గినట్టు కనిపించినా… ఆ తరువాత తగ్గేది లేదని కిమ్ చెప్పకనే చెప్పాడు. వారం క్రితం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి భయపెట్టిన కిమ్, మరోసారి క్షిపణీ ప్రయోగం చేసి షాక్ ఇచ్చాడు. 700 కిమీ పరిధిలోని లక్ష్యాలను చేధించగల శక్తి గలిగిన ఈ బాలిస్టిక్ క్షపణి ప్రయోగం సక్సెస్ అయినట్టు ఉత్తర కొరియా అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో దక్షిణ కొరియా…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన పార్టీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడం, గ్రామీణాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఆహార ఉత్పత్తులను పెంచుకోవడం వంటివాటిపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్ స్టఫ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అగ్రరాజ్యం గురించి, జపాన్, దక్షిణ కొరియా గురించి ఏలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, దేశ రక్షణ విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేసిన…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆయుధాలు, దేశ సరిహద్దులు, శతృదేశాలు, అమెరికా,దక్షిణ కొరియాపై ఆగ్రహ జ్వాలలు వంటి మాటలతో ఆవేశంగా మాట్లాడే కిమ్, ఈసారి ఆ మాటలను పక్కన పెట్టి దేశాభి వృద్ది గురించి, దేశంలో నెలకొన్న సమస్యల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ది గురించి, ఆహార సమస్యల నుంచి బయటపడే విషయాల గురించి మాట్లాడారు. 2022 వ సంవత్సరాన్ని గ్రేట్ లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ ఇయర్ గా…
ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అధికారాన్ని చేపట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ప్లీనరీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఐదురోజులపాటు ఈ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో కిమ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. దేశాన్ని అర్థికంగా బలోపేతం చేసేందుకు బలంగా కృషిచేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కరోనా కారణంగా దేశ సరిహద్దులను మూసివేశారు. దేశంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. Read: తెలంగాణలో…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పేరు చెప్తేచాలు వణుకుపుట్టేస్తుంది. పదేళ్ల క్రితం ఉత్తర కొరియాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిమ్ దేశం మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడమే కాకుండా, పక్కనే ఉన్న దక్షిణ కొరియాకు, జపాన్కు నిద్రలేకుండా చేస్తున్నాడు. అందరూ కరోనా భయంతో లాక్డౌన్ చేసుకుంటే, కిమ్ మాత్రం దేశంలోకి కరోనాను ఎంటర్ కానివ్వకుండా సరిహద్దులను మూసేయించాడు. అంతేకాదు, హైపర్సోనిక్, విధ్వంసకర క్షిపణుల ప్రయోగాలు చేస్తూ దడపుట్టిస్తున్నాడు. కిమ్ పై ఉత్తర కొరియాలోనే కాదు ఏ దేశంలో…