కిమ్ మరో కీలక నిర్ణయం: గ్రామీణాభివృద్ధి, ఆహారంపై ప్రత్యేక దృష్టి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆయుధాలు, దేశ సరిహద్దులు, శతృదేశాలు, అమెరికా,దక్షిణ కొరియాపై ఆగ్రహ జ్వాలలు వంటి మాటలతో ఆవేశంగా మాట్లాడే కిమ్, ఈసారి ఆ మాటలను పక్కన పెట్టి దేశాభి వృద్ది గురించి, దేశంలో నెలకొన్న సమస్యల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ది గురించి, ఆహార సమస్యల నుంచి బయటపడే విషయాల గురించి మాట్లాడారు. 2022 వ సంవత్సరాన్ని గ్రేట్ లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ ఇయర్ గా అభివర్ణించాడు. కొత్త సంవత్సరంలో దేశం ముందు ఎదురౌతున్న సవాళ్లను ఎదుర్కొనడానికి అధికారులు కృషిచేయాలని అన్నారు.
Read: కరోనా పాజిటివిటి రేటు 5 శాతం దాటితే…
Also Read
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
కరోనా మహమ్మారి సమయంలో ఉత్తర కొరియా తీవ్రమైన ఆహర సమస్యను ఎదుర్కొన్నది. తీవ్రమైక కరువు ఏర్పడింది. సరిహద్దులు మూసేయడంతో చైనాతో వాణిజ్యం ఆగిపోయింది. దీంతో ఆహరం పరంగా ఉత్తర కొరియా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆహారం సమకూర్చుకోవడం, మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగడమే ప్రధానంశంగా పెట్టుకోవాలని అధికారులకు కిమ్ సూచించాడు. ఆహార సమస్య నుంచి బయటపడేందుకు అవసరమైతే ప్రభుత్వ కార్యక్రమాల నిధులకు కోతలు విధించినా పర్వాలేదని అన్నారు. ఆహార సమస్య నుంచి బయటపడేందుకు ఫుడ్ స్టఫ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనున్నారు. కిమ్ జోంగ్ ఉన్ అధికారంలోకి వచ్చి పదేళ్లైన సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రక్షణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతూనే దేశం అభివృద్దికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసకున్నారు. చాలా కాలం తరువాత కిమ్ ఆహరం గురించి, దేశంలోని సమస్యలపైన కీలక ప్రసంగం చేయడంతో ఆ దేశంలో ఆనందం వెల్లివిరిసింది. కిమ్లో మార్పులు వచ్చినందుకు అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?