ఉత్తర కొరియాలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అక్కడి ప్రజలు తీవ్రమైన ఆకలి, పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐరాస మానవహక్కుల ప్రత్యేక ప్రతినిధి క్వింటానా నివేదిక పేర్కొన్నది. ఈ నివేదికపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ విరుచుకుపడ్డారు. క్వింటానా నివేదిక ద్వేషపూరితమైన అపవాదుగా ఉందని, తమ దేశంలోని వాస్తవ పరిస్థితులు, ప్రజల జీవన విధానం తెలియకుండా నివేదికలు తయారు చేస్తున్నారని, మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశం తీసుకున్న స్వీయరక్షణ ఏర్పాట్లను పేర్కొన్నారని కిమ్ విమర్శించారు. తాము ఈ నివేదికను గుర్తించడం…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అణ్వాయుధ క్షిపణుల ప్రయోగాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇటీవలే హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఉత్తర కొరియా తాజాగా మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. మంగళవారం ఉదయం ఉత్తర కొరియా తూర్పుతీరంలో ఈ క్షిపణిని ప్రయోగించింది జపాన్కు షాక్ ఇచ్చింది. జపాన్ లక్ష్యంగా చేసుకొని ఈ క్షిపణిని ప్రయోగించినట్టు సమాచారం. అంతర్జాతీయ ఆంక్షలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా కిమ్ అణ్వస్త్ర ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు. దక్షిణ కొరియా రాజధాని…
అమెరికా, ఉత్తర కొరియా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తర కొరియా విషయంలో కాస్త కటువుగా వ్యవహరిస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేయాలంటే అణ్వస్త్రాలను పక్కనపెట్టాలని అప్పుడే ఆంక్షల విషయంపై ఆలోచిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఉత్తర కొరియా మండిపడుతున్నది. కాగా, ఇప్పుడు మరోసారి కిమ్ అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఫెన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా వంటి దేశాల…
ఉత్తర కొరియా గురించిన ఎలాంటి చిన్న వార్త బయటకు వచ్చినా అది వెంటనే వైరల్ గా మారటం సహజమే. ఆ దేశంలో జరిగే విషయాలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటాయి. గత కొంతకాలంగా కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని వార్తలు అధికంగా వచ్చే సమయంలో ఆయనకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రచురిస్తుంటుంది. అయితే, ఆయన ఆకారంలో వచ్చిన మార్పులను బట్టి కొన్ని రకాల ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నారన్నది మాత్రం వాస్తవం. ఇక ఇదిలా…
ప్రపంచ వ్యాప్తంగా అణ్వస్త్ర ఆయుధాలపై నిషేధం కొనసాగుతున్న వేళ ఉత్తరకొరియా ‘బాంబు’ పేల్చింది. చాలా దేశాలు అణురహితంగా మారుతున్న వేళ కొరియన్ దేశం క్షిపణి పరీక్ష చేసింది. నార్త్ కొరియా అందరీ కంటే దూకుడుగా అణ్వస్త్రం వైపు అడుగులు వేస్తూ ఆసియా ఖండానికే పెనుముప్పుగా మారింది. ఉత్తర కొరియా ఇప్పుడు ఆహార సంక్షోభంతో అల్లాడుతోంది. దేశంలో ఓవైపు కరోనా, విధ్వంసాలు, ఆహార కొరత వంటి పరిస్థితులు పట్టిపీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నార్త్ కొరియా ఆయుధాలను సమకూర్చుకునేందుకు మొగ్గుచూపుతుండటం…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.. ఆయన ఇచ్చే ఆదేశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతూ ఉంటుంది.. ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని దేశాలను కలవరానికి గురిచేస్తుండగా… కోవిడ్ కట్టడానికి అన్ని దేశాలు వ్యాక్సినేషన్ పై ఫోకస్ పెడుతున్నాయి.. ఈ తరుణంలో కిమ్ షాకింగ్ ప్రకటన చేశారు.. కోవిడ్ వ్యాక్సిన్ తమకు అవసరం లేదని ప్రకటించారు.. దీనికి బదులుగా తమదైన శైలిలో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయాలంటూ అధికారులకు…
ప్రపంచంలో మహమ్మారి కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కరోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. వ్యాక్సిన్ కోసం ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవాక్స్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్ ద్వారా ప్రపంచంలోకి పేద, మద్యతరగతి దేశాలకు వ్యాక్సిన్లను అందిస్తోంది. అయితే, కోవాక్స్లో భాగంగా ఉత్తర కొరియాకు 30 మిలియన్ డోసుల సీనోవ్యాక్ డోసులు అందించేందుకు కోవాక్స్ ముందుకు రాగా, దానిని ఉత్తర కొరియా తిరస్కరించింది. తమకు ఆ వ్యాక్సిన్ డోసులు…
ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్ గురించిన ఏ చిన్న వార్త అయినా ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ప్రపంచానికి ఎలాంటి చేటు తీసుకొస్తారో అని భయపడుతుంటారు. గత ఏడాది నుంచి అనేకమార్లు కిమ్ ప్రపంచానికి, మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన అలా దూరంగా ఉన్నన్ని రోజులు ప్రపంచంలో తెలియని భయం నెలకొనేది. కిమ్ ఆరోగ్యం బాగాలేదా, లేదంటే రహస్యంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా? లేదా అసలు కిమ్ ఉన్నారా…
2018 వరకు అంతంత మాత్రంగానే ఉన్న ఉభయ కొరియాల మధ్య సంబంధాలు, ఆ తరువాత కాస్త మెరుగుపడ్డాయి. ఇరు దేశాల అధినేతలు మూడుసార్లు భేటీ అయ్యారు. సంబంధాలు మెరుగుపరుచుకున్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడు ఉభయ కొరియా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తాను మధ్యవర్తిగా వ్యవహరిస్తానని చెప్పడంతో వియాత్నం వేదికగా ఉత్తర కొరియా, అమెరికా దేశాధినేతల సమావేశం జరిగింది. అయితే, ఈ చర్చలు విఫలం కావడంతో దాని ప్రభావం ఉభయ కొరియాల మధ్య సంబంధాలపై…
ఉత్తర కొరియాలో నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించకుంటే శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. అయితే గత కొంతకాలంగా దక్షిణ కొరియా కల్చర్ను ఉత్తర కొరియా యువత ఫాలో అవుతున్నది. దక్షిణ కొరియా స్టైల్ను, ఫ్యాషన్ను, వారు మాట్లాడే విధంగా మాట, యాసలు అలవరుచుకుంటున్నారు. ఇలా చేయడం వలన ఉత్తర కొరియా సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతింటాయని, యువత పక్కదోవ పడుతున్నారని భావించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ…