Khawaja Asif: భారత్- పాకిస్తాన్ మధ్య ఓ వైపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ చేసిన కొన్ని ప్రకటనలు కామెడీని మించుతున్నాయి. ముఖ్యంగా, ఆయన అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలు సొంతదేశంలోనే ట్రోల్కి గురవుతున్నాయి. అక్కడి ఎంపీలు రక్షణ మంత్రి దేశాన్ని నవ్వులపాలు చేస్తున్నాడని మండిపడుతున్నాయి.
గత మూడు రోజులుగా భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే.. ఈ మూడు రోజుల్లోనే పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పాకిస్థాన్ తమ మధ్యవర్తిత్వం కోసం ఏదో ఒక దేశం ముందుకు రావాలని కోరుకుంటోంది. అప్పుడే…
Pakistan: భారతదేశం చేతిలో ఎన్ని సార్లు భంగపాటుకు గురైనా నాదే పైచేయి అంటుంది పాకిస్తాన్. అబద్ధాలను అవలీలగా ప్రచారం చేస్తుంది. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వంలో అగ్ర నేతలుగా చలామణీ అవుతున్న వారు కూడా అబద్ధాలను ప్రచారంలో చేయడంలో పోటీ పడుతున్నారు. తమ పౌరుల్ని అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ నుంచి పాకిస్తాన్ని భారత్ త్రివిధ దళాలు చితకబాదుతున్నా కూడా బుద్ధి రావడం లేదు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం అర్ధరాత్రి పాకిస్తాన్, పీఓకేలోని 9 ప్రదేశాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సైనిక చర్య జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయాలతో సహా 9 ప్రదేశాలను ధ్వంసం చేసింది. భారత సైనిక దళాలు చేసిన ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అణ్వాయుధ దాడి చేస్తామని, బలమైన ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. యుద్ధం ఆపండి…
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వణికిపోతోంది. భారత్ ప్రతీకారంగా ఎప్పుడు తమపై విరుచుకుపడుతుందో తెలియక దాయాది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఆందోళన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వంలోని కీలక నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు. ప్రభుత్వంలో మంత్రులు భారత్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, భారత్ దాడి చేస్తే అణ్వాయుధాలతో దాడి చేస్తామని చెబుతున్నారు.
India Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల్ని పెంచింది. 26 మంది అమాయకపు టూరిస్టుల్ని లష్కరే తోయిబా ఫ్రాక్సీ ‘‘ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు కాల్చి చంపారు. మతం ఆధారంగా మారణహోమానికి పాల్పడ్డారు. అయితే, ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. దాడిలో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఇప్పటికే, భారత్ పాకిస్తాన్పై దౌత్య చర్యలు మొదలుపెట్టింది. పాక్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి ‘‘సింధు…
Pak Minister Asif: హల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపత్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ సంచలన కామెంట్స్ చేశారు.
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నాడు. బ్రిటన్కు చెందిన స్కై న్యూస్తో జరిగిన సంభాషణలో ఖవాజా ఆసిఫ్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఉగ్రవాదానికి నిధులను అందించడంలో పాకిస్థాన్కు సుదీర్ఘ చరిత్ర ఉందని అంగీకరించారు. తాము 30 సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామన్నారు.
కశ్మీర్ భూమిపై మరోసారి భారతీయుల రక్తం చిందింది. సెలవుల్లో ఆహ్లాదంగా గడుపుదామని పహల్గామ్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృత్యుఒడికి చేరుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంటల్లో భర్త కాటికి, భార్య సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటివరకు కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా దీనిని పరిగణిస్తున్నారు. ఇందులో 28 మంది మరణించినట్లు సమాచారం. అయితే.. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది.…
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో పాకిస్థాన్కు ఎటువంటి సంబంధం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బుధవారం అన్నారు. పొరుగు దేశంలో అశాంతికి భారతదేశం మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అధికార PML-N పార్టీ సీనియర్ నాయకుడు, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సన్నిహితుడు అయిన ఆసిఫ్, జమ్మూ కాశ్మీర్లో హింసకు కేంద్రపాలిత ప్రాంతంలోని విప్లవం, స్వదేశీ శక్తులే అంటూ కల్లబొల్లి మాటలు చెప్పారు.