Khawaja Asif: భారత్ ముందు మోకరిల్లిన పాక్.. దాడులను ఆపండి.. మేము ఏమీ చేయము
- భారత్ ముందు మోకరిల్లిన పాక్
- దాడులను ఆపండి.. మేము ఏమీ చేయము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం అర్ధరాత్రి పాకిస్తాన్, పీఓకేలోని 9 ప్రదేశాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సైనిక చర్య జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయాలతో సహా 9 ప్రదేశాలను ధ్వంసం చేసింది. భారత సైనిక దళాలు చేసిన ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అణ్వాయుధ దాడి చేస్తామని, బలమైన ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. యుద్ధం ఆపండి మహా ప్రభో అంటూ భారత్ ముందు మోకరిల్లుతోంది.
Also Read:Amit Shah: సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించండి.. ఆర్మీకి అమిత్ షా ఆదేశాలు..
Also Read
పహల్గామ్ దాడి తర్వాత భారత్ దౌత్యపరమైన చర్యలు తీసుకున్న తర్వాత, పాకిస్తాన్ అగ్ర నాయకులందరూ ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు పొరుగు దేశంలో నిశ్శబ్దం నెలకొంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే పాకిస్తాన్ ఇప్పుడు కాల్పుల విరమణ ప్రకటించింది. మమ్మల్ని మేము రక్షించుకుంటామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఒక టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడుతూ.. భారతదేశం ఎటువంటి తదుపరి చర్య తీసుకోకపోతే, మేము కూడా ఏమీ చేయమని తెలిపారు.
Also Read:Tollywood : ఆపరేషన్ సింధూర్ పై సినీ తారల ఎమోషనల్ ట్వీట్స్
ఖ్వాజా అహంకారం కొన్ని గంటల్లోనే మాయం
భారత్ చర్య తర్వాత, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నామని ఖవాజా ఆసిఫ్ చెప్పడం గమనార్హం. భారతదేశం తన గగనతలం నుంచి పాకిస్తాన్ ప్రాంతాలలో ఈ దాడులను నిర్వహించిందని కూడా ఆయన అన్నారు. దీనికి తగిన సమాధానం ఇస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి పేర్కొన్నారు. అయితే, అతను కొన్ని గంటల్లోనే తన ప్రకటనను విరమించుకున్నాడు. ఇప్పుడు భారతదేశం ఏదైనా ఇతర చర్యలు తీసుకోకపోతే తాము ఏమీ చేయమని చెప్పాడు.
తాజావార్తలు
-
Kumar Sangakkara: “వైభవ్తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను”.. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
-
UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..