India Pakistan: పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ “ఎక్స్” అకౌంట్పై నిషేధం..
- పాకిస్తాన్ రక్షణ మంత్రి ఎక్స్ అకౌంట్ బ్లాక్..
- ఇటీవల ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇస్తుందని అంగీకరించిన ఆసిఫ్..
- ఈ వ్యాఖ్యల తర్వాత కీలక చర్య తీసుకున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల్ని పెంచింది. 26 మంది అమాయకపు టూరిస్టుల్ని లష్కరే తోయిబా ఫ్రాక్సీ ‘‘ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు కాల్చి చంపారు. మతం ఆధారంగా మారణహోమానికి పాల్పడ్డారు. అయితే, ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. దాడిలో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఇప్పటికే, భారత్ పాకిస్తాన్పై దౌత్య చర్యలు మొదలుపెట్టింది. పాక్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది.
Read Also: Mani Sharma – Bheems : అప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్తో భీమ్స్ ముచ్చట్లు!
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ఇదిలా ఉంటే, మంగళవారం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ అకౌంట్ని భారత్ బ్లాక్ చేసింది. ప్రపంచ ఉగ్రవాదానికి పాక్ సహకరించిందని ఆసిఫ్ ఇటీవల ఒప్పుకోవడంతో భారత్ నుంచి ఈ చర్య వచ్చింది. గత వారం స్కై న్యూస్ ఇంటర్వ్యూలో..‘‘పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు, శిక్షణ, నిధులు అందించే చరిత్ర ఉంది’’ అని అంగీకరించాడు. తాము సుమారుగా మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ వెస్ట్రన్ దేశాల కోసం ఈ నీచమైన పని చేస్తున్నాము అని అన్నారు.
ఇదే విషయాన్ని భారతదేశం ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజన పటేల్ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ తన ప్రమేయాన్ని స్పష్టంగా ఒప్పుకున్నట్లు అభివర్ణించారు. ఇప్పటికే, భారత్ 63 మిలియన్ల సబ్స్క్రైబర్ బేస్ కలిగిన 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్లను నిషేధించింది. ఈ చర్య వచ్చిన ఒక రోజు తర్వాత పాక్ రక్షణ మంత్రి ఎక్స్ అకౌంట్ని భారత్ బ్యాన్ చేసింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!