Pakistan: భారత్, ఇజ్రాయిల్ ఒక్కటే.. పాక్ రక్షణ మంత్రి అబద్ధాల ప్రచారం..
- భారత్, ఇజ్రాయిల్ ఒక్కటే, వీరికి ఇస్లాం అంటే నచ్చదు..
- భారత్కి ధీటుగా బదులిస్తున్నాం..
- పార్లమెంట్ వేదిక పాకిస్తాన్ రక్షణ మంత్రి అబద్ధాల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారతదేశం చేతిలో ఎన్ని సార్లు భంగపాటుకు గురైనా నాదే పైచేయి అంటుంది పాకిస్తాన్. అబద్ధాలను అవలీలగా ప్రచారం చేస్తుంది. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వంలో అగ్ర నేతలుగా చలామణీ అవుతున్న వారు కూడా అబద్ధాలను ప్రచారంలో చేయడంలో పోటీ పడుతున్నారు. తమ పౌరుల్ని అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ నుంచి పాకిస్తాన్ని భారత్ త్రివిధ దళాలు చితకబాదుతున్నా కూడా బుద్ధి రావడం లేదు.
తాజాగా, ఈరోజు జరిగిన పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మళ్లీ అబద్ధాలకు తెరతీశాడు. భారతదేశంతో ఉద్రిక్తత నేపథ్యంలో పాకిస్తాన్పై ఇతర దేశాల ఒత్తిడిని అంగీకరించేది లేదని చెప్పాడు. పాక్ ఆర్మీ భారత పౌరుల్ని లక్ష్యంగా చేసుకోదని, కేవలం వారి సైనిక స్థావరాలనే టార్గెట్ చేస్తామని చెప్పారు. తాము భారత్కి ధీటుగా 200 శాతం స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాడు.
Also Read
- FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
- US - Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- JD Vance Fourth Child: నాలుగోసారి తండ్రైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. 150 ఏళ్ల అమెరికా చరిత్రలో అరుదైన ఘట్టం
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
Read Also: India Pakistan War: ‘‘ఆ నవ్వు చెబుతుంది, పాకిస్తాన్ నష్టం గురించి’’..
భారత్ తన సొంత ప్రజల్ని శాంతింపచేయడానికి వారి మీడియా తప్పుడు ప్రచారం చేసిందని పాక్ మంత్రి ఆరోపించాడు. భారత్ ఓడిపోతుందనే విషయాన్ని చెప్పడం లేదని అన్నారు. ఇజ్రాయిల్, భారత్ మధ్య పొత్తు సహజమని, ఈ రెండు దేశాలు ఇస్లాం పట్ల బహిరంగ వ్యతిరేకతను కలిగి ఉన్నాయని ఆరోపించాడు. పాకిస్తాన్కి టర్కీ, అజర్బైజాన్ దేశాలు మద్దతు ఇస్తున్నాయని, భారత్కి దాని మిత్రులు కూడా సాయం చేయడం లేదని మరో అబద్ధం చెప్పాడు.
ఎల్ఓసీ వద్ద భారత్ చర్యల్ని పాకిస్తాన్ సైన్యం అడ్డుకుందని, భారత్ డ్రోన్ దాడులు పాకిస్తాన్ కీలక ప్రదేశాలను గుర్తించాలని వచ్చాయని, అయితే, పాక్ తన కీలక స్థానాలు తెలియకుండా ఉండేందుకే వాటిని అడ్డుకోలేదని సంచలన అబద్ధాని చెప్పాడు. డ్రోన్లు తమ పరిధిలోకి వచ్చిన తర్వాత వాటిని కూల్చేశామని అన్నారు. భారత్తో ఉద్రిక్త పరిస్థితులు తగ్గించడానికి పాకిస్తాన్ ప్రతీరోజూ యూఏఈ, సౌదీ అరేబియా, చైనాతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పాడు.
🚨 Joke of the DAY.
Pakistan Defence Minister says — "We didn’t intercept Indian drones to avoid exposing our locations." 😂 pic.twitter.com/3u4dlpqkxB
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 9, 2025
తాజావార్తలు
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
-
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
-
FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!