Pakistan: భారత్, ఇజ్రాయిల్ ఒక్కటే.. పాక్ రక్షణ మంత్రి అబద్ధాల ప్రచారం..
- భారత్, ఇజ్రాయిల్ ఒక్కటే, వీరికి ఇస్లాం అంటే నచ్చదు..
- భారత్కి ధీటుగా బదులిస్తున్నాం..
- పార్లమెంట్ వేదిక పాకిస్తాన్ రక్షణ మంత్రి అబద్ధాల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారతదేశం చేతిలో ఎన్ని సార్లు భంగపాటుకు గురైనా నాదే పైచేయి అంటుంది పాకిస్తాన్. అబద్ధాలను అవలీలగా ప్రచారం చేస్తుంది. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వంలో అగ్ర నేతలుగా చలామణీ అవుతున్న వారు కూడా అబద్ధాలను ప్రచారంలో చేయడంలో పోటీ పడుతున్నారు. తమ పౌరుల్ని అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ నుంచి పాకిస్తాన్ని భారత్ త్రివిధ దళాలు చితకబాదుతున్నా కూడా బుద్ధి రావడం లేదు.
తాజాగా, ఈరోజు జరిగిన పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మళ్లీ అబద్ధాలకు తెరతీశాడు. భారతదేశంతో ఉద్రిక్తత నేపథ్యంలో పాకిస్తాన్పై ఇతర దేశాల ఒత్తిడిని అంగీకరించేది లేదని చెప్పాడు. పాక్ ఆర్మీ భారత పౌరుల్ని లక్ష్యంగా చేసుకోదని, కేవలం వారి సైనిక స్థావరాలనే టార్గెట్ చేస్తామని చెప్పారు. తాము భారత్కి ధీటుగా 200 శాతం స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాడు.
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
- China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
Read Also: India Pakistan War: ‘‘ఆ నవ్వు చెబుతుంది, పాకిస్తాన్ నష్టం గురించి’’..
భారత్ తన సొంత ప్రజల్ని శాంతింపచేయడానికి వారి మీడియా తప్పుడు ప్రచారం చేసిందని పాక్ మంత్రి ఆరోపించాడు. భారత్ ఓడిపోతుందనే విషయాన్ని చెప్పడం లేదని అన్నారు. ఇజ్రాయిల్, భారత్ మధ్య పొత్తు సహజమని, ఈ రెండు దేశాలు ఇస్లాం పట్ల బహిరంగ వ్యతిరేకతను కలిగి ఉన్నాయని ఆరోపించాడు. పాకిస్తాన్కి టర్కీ, అజర్బైజాన్ దేశాలు మద్దతు ఇస్తున్నాయని, భారత్కి దాని మిత్రులు కూడా సాయం చేయడం లేదని మరో అబద్ధం చెప్పాడు.
ఎల్ఓసీ వద్ద భారత్ చర్యల్ని పాకిస్తాన్ సైన్యం అడ్డుకుందని, భారత్ డ్రోన్ దాడులు పాకిస్తాన్ కీలక ప్రదేశాలను గుర్తించాలని వచ్చాయని, అయితే, పాక్ తన కీలక స్థానాలు తెలియకుండా ఉండేందుకే వాటిని అడ్డుకోలేదని సంచలన అబద్ధాని చెప్పాడు. డ్రోన్లు తమ పరిధిలోకి వచ్చిన తర్వాత వాటిని కూల్చేశామని అన్నారు. భారత్తో ఉద్రిక్త పరిస్థితులు తగ్గించడానికి పాకిస్తాన్ ప్రతీరోజూ యూఏఈ, సౌదీ అరేబియా, చైనాతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పాడు.
🚨 Joke of the DAY.
Pakistan Defence Minister says — "We didn’t intercept Indian drones to avoid exposing our locations." 😂 pic.twitter.com/3u4dlpqkxB
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 9, 2025
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!