Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన తీర్పు.. బోరున ఏడ్చేసిన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌండ్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్, మనీష్లను కోర్టు డిశ్చార్జ్ చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సహచరుడు మనీష్ సిసోడియాలను రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. సీబీఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారీ ఛార్జ్షీట్లో అనేక లోపాలు (lacunae) ఉన్నాయని, వాటికి సాక్షులు లేదా స్టేట్మెంట్ల మద్దతు లేదని స్పష్టం చేసింది. సిసోడియాపై ప్రాథమికంగా కేసు (prima facie case) కూడా నిలబడలేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ను సరైన ఆధారాలు లేకుండా ఇరికించారని జడ్జి వ్యాఖ్యానించారు.
READ MORE: O Panneerselvam: డీఎంకేలో చేరిన జయలలిత ఆప్తుడు, మాజీ సీఎం పన్నీర్ సెల్వం..
Also Read
- BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
- TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
- Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
- DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. తీర్పు తర్వాత, తనపై ఉన్న కేసు పూర్తిగా కల్పితమని మరోసారి పునరుద్ఘాటించారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయడానికి స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని ఐదుగురు ప్రముఖ నాయకులను జైలులో పెట్టారని గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అరెస్టు చేసి జైలుకు పంపారని, ఇది భారత చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగలేదని అన్నారు. తాను ఆరు నెలలు జైలులో ఉన్నానని, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాదాపు రెండు సంవత్సరాలు జైలులో గడిపారని తెలిపారు. ఈ లిక్కర్ వ్యవహారం కల్పితమని, తన ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. టీవీ ఛానెళ్లలో తనను పదే పదే అవినీతిపరుడిగా చిత్రీకరించారని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర దర్యాప్తు సంస్థ, సీబీఐ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని సీబీఐ సూచించింది. ఇక సీబీఐ న్యాయవాదులు ఈ ఉత్తర్వును వివరంగా అధ్యయనం చేసి అప్పీల్ దాఖలు చేయనున్నారు.
READ MORE: JrNTR-Neel : ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ‘డ్రాగన్’ అప్డేట్..
తాజావార్తలు
-
BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
-
TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
-
Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
-
Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!