Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన తీర్పు.. బోరున ఏడ్చేసిన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌండ్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్, మనీష్లను కోర్టు డిశ్చార్జ్ చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సహచరుడు మనీష్ సిసోడియాలను రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. సీబీఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారీ ఛార్జ్షీట్లో అనేక లోపాలు (lacunae) ఉన్నాయని, వాటికి సాక్షులు లేదా స్టేట్మెంట్ల మద్దతు లేదని స్పష్టం చేసింది. సిసోడియాపై ప్రాథమికంగా కేసు (prima facie case) కూడా నిలబడలేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ను సరైన ఆధారాలు లేకుండా ఇరికించారని జడ్జి వ్యాఖ్యానించారు.
READ MORE: O Panneerselvam: డీఎంకేలో చేరిన జయలలిత ఆప్తుడు, మాజీ సీఎం పన్నీర్ సెల్వం..
Also Read
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
- Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. తీర్పు తర్వాత, తనపై ఉన్న కేసు పూర్తిగా కల్పితమని మరోసారి పునరుద్ఘాటించారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయడానికి స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని ఐదుగురు ప్రముఖ నాయకులను జైలులో పెట్టారని గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అరెస్టు చేసి జైలుకు పంపారని, ఇది భారత చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగలేదని అన్నారు. తాను ఆరు నెలలు జైలులో ఉన్నానని, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాదాపు రెండు సంవత్సరాలు జైలులో గడిపారని తెలిపారు. ఈ లిక్కర్ వ్యవహారం కల్పితమని, తన ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. టీవీ ఛానెళ్లలో తనను పదే పదే అవినీతిపరుడిగా చిత్రీకరించారని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర దర్యాప్తు సంస్థ, సీబీఐ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని సీబీఐ సూచించింది. ఇక సీబీఐ న్యాయవాదులు ఈ ఉత్తర్వును వివరంగా అధ్యయనం చేసి అప్పీల్ దాఖలు చేయనున్నారు.
READ MORE: JrNTR-Neel : ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ‘డ్రాగన్’ అప్డేట్..
తాజావార్తలు
-
France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
-
Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!