Home
Kerala
Kerala News
-
‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన సూపర్ హీరో
‘ఆర్ఆర్ఆర్’.. ప్రస్తుతం ఏ భాషలో విన్నా ఈ సినిమా గురించే చర్చ. సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదలవుతున్న ఈ సినిమా ప్రొమొతిఒన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. ఈ భాషలో ఈవెంట్ పెడితే ఆ భాషలోని స్టార్ హీరోలను గెస్ట్ గా పిలుస్తూ అటెన్షన్ రాబడుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ గెస్ట్ గా రాగా, తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కోలీవుడ్ హీరోలు… -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: కేరళలోనూ నైట్ కర్ఫ్యూ…
దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలపై అనేక రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించాయి. తాజాగా కేరళ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలు… -
కేరళలో కలకలం రేపుతున్న రాజకీయ హత్యలు
కేరళలోని అలప్పుజా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం నాడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కేఎస్ షాన్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. శనివారం రాత్రి పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ ఘటన మరువకముందే ఆదివారం ఉదయం బీజేపీ నేత రెంజిత్ శ్రీనివాసన్ కూడా హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి హత్య చేసినట్లు తెలుస్తోంది.… -
పిటి ఉషపై పోలీస్ కేసు నమోదు
పరుగుల రాణి పిటి ఉషపై కేరళలోని కోజికోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు ఉషపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కోజికోడ్లో 1,012 చదరపు అడుగుల ఫ్లాట్ను జెమ్మా జోసెఫ్ కొనుగోలు చేశారని, వాయిదాల రూపంలో రూ. 46 లక్షలు చెల్లించారని తెలిపారు. Read Also:కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఒక ఉగ్రవాది హతం అయినప్పటికీ ఆ ఫ్లాట్ను బిల్డర్ జోసెఫ్కు ఇవ్వలేదు. అయితే పిటి ఉష… -
కేరళ పోలీసులకు సోలార్ గొడుగులు
ఎండైనా, వానైనా, మంచైనా … ట్రాఫిక్ పోలీసులు తమ విధులను నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మండుటెండల్లో, వడగాల్పుల్లో గంటల తరబడి నిల్చొని విధులను నిర్వహించడం ట్రాఫిక్ పోలీసులకు చాలా ఇబ్బంది. వీరి కష్టాలను గమనించిన కేరళ ప్రభుత్వం… కొన్ని ప్రత్యేక సదుపాయాలతో సౌర గొడుగులను అందిస్తోంది. కేవలం తలకు చల్లదనాన్ని ఇవ్వడమేకాదు.. ఈ గొడుగుల్లో ఫ్యాన్, మంచినీటి బాటిల్ పెట్టుకునే స్టాండ్ , గొడుగుతోపాటు కూర్చునేందుకు సీటు, వెలుతురు కోసం లైటు ఏర్పాటుచేసే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.… -
కష్టాల్లో కేరళ: నిన్నటి వరకు వరదలు, కరోనా, బర్డ్ఫ్లూ…నేడు ఒమిక్రాన్…
కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అటువంటి కేరళ ఇప్పుడు వరస విపత్తులతో అతలాకుతం అవుతున్నది. దేశంలో తొలి కరోనా కేసులు కేరళ రాష్ట్రంలోనే కనిపించాయి. ఫస్ట్ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న కేరళ రెండో వేవ్లో చాలా ఇబ్బందులు పడింది. ఇప్పటికి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేరళలో ఇప్పటికీ పాజిటివిటి రేటు 10 శాతం వరకు ఉన్నది. కరోనాతో పాటు వరదలు, మరోవైపు బర్డ్ఫ్లూ కేసులు ఆ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. Read: డెంగీతో బీజేపీ… -
కేరళను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ… అలప్పుజలో అలర్ట్..
కేరళ రాష్ట్రాన్ని బర్డఫ్లూ భయపెడుతున్నది. ఆ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అలప్పుజ జిల్లాలో కోళ్లు, బాతులు ఫ్లూ బారిన పడుతున్నాయి. జిల్లాలోని తకళి గ్రామ పంచాయతీలో సుమారు 1200 బాతులు బర్డ్ప్లూ బారిన పడటంతో వాటిని అధికారులు పట్టుకొని చంపేశారు. అలప్పుజ జిల్లాలో ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Read: అన్నమయ్య… -
మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం..
కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. మహారాష్ట్రలో కేసులు తగ్గుముఖం పట్టినా.. కేరళలో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూశాయి.. ఇదే సమయంలో అక్కడ బర్డ్ఫ్లూ కేసులు కూడా బయటపడి ఆందోళనకు గురిచేశాయి.. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా కేసులు నమోదయ్యాయి.. అయితే, తాజాగా మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు కేరళలో వెలుగు చూశాయి. అలప్పుజా జిల్లాలో కొత్తగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్కు రాష్ట్ర పశుసంవర్ధక… -
మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడితే సహించం: పినరయి విజయన్
కేరళలో మతతత్వాన్ని వ్యాపింపజేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలు చేస్తుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్ అవకాశవాద ధోరణితో దానికి బలం చేకూర్చేలా వ్యవహరిస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. ఆదివారం అలప్పుజాలో జరిగిన పి కృష్ణపిళ్లై స్మారక అధ్యయన కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయన్ మాట్లాడుతూ, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి సంఘ్పరివార్ ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తుంటే, అధికారం ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న అవకాశంతో కాంగ్రెస్ ఆ మతత్వశక్తులతో మద్దతునిస్తుందని ఆయన అన్నారు. మతతత్వాన్ని వ్యాపింపజేసేందుకు ఆహారం, దుస్తులు వంటి వాటిని… -
మహిళా కార్యకర్తపై అధికార నేత అరాచకం.. అత్యాచారం చేసి నగ్న వీడియోలను…
కేరళలో దారుణం చోటుచేసుకొంది. అధికార పార్టీ నేత ఆగడాలకు ఒక అబల బలైపోయింది. బలవంతంగా ఆమెను అనుభవించి, ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరింపులకు పాల్పడి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.. ఆమె డబ్బు ఇవ్వనని చెప్పడంతో ఆమె నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె పరువు తీశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరువల్ల పరిధిలోని స్థానిక సీపీఎం నేత గతేడాది మే నెలలో తన పార్టీలో…
తాజావార్తలు
-
Rajamouli Goes Global: రాజమౌళికి అరుదైన గౌరవం
-
Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
-
Saikrishna Mother Vijayalakshmi: “నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?”.. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
-
Sreeleela: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన శ్రీలీల.. అబ్బాయిలూ నోట్ చేసుకోండి!
-
Saikrishna Case: “నా కొడుకు బూడిద నాకు కావాలి.. లేదంటే ఆత్మాహుతే..” సాయికృష్ణ తల్లి ఆవేదన
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..