BJP : బీజేపీలో ఈటెల కొత్త సంప్రదాయానికి తెర లేపారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ నాయకుడు బీజేపీలో కొత్త సంప్రదాయానికి తెర లేపారా? వచ్చే ఎన్నికల్లో పలానా చోటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంలో ఆంతర్యం ఏంటి? అధిష్ఠానం చెప్పిందా.. లేక ఆయనే అడ్వాన్స్ అయ్యారా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి?
బీజేపీలో ఎంతటి పెద్దవాళ్లయినా సరే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుంది. ఆ అధికారం రాష్ట్ర పార్టీ చేతిలో కూడా ఉండదు. అందుకే ఈ విషయంలో బీజేపీ నేతలు ఎవరూ బయటకు మాట్లాడరు. గట్టిగా ప్రశ్నిస్తే… అది పార్టీ డిసైడ్ చేస్తుందని చెప్పి తప్పించుకుంటారు. బీజేపీ చెబితే ఎక్కడి నుంచైనా బరిలో ఉంటామని మరో మాట దానికి జత చేస్తారు. ఈ సంప్రదాయానికి భిన్నంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల చేసిన ప్రకటన ప్రస్తుతం కాషాయ శిబిరంలో చర్చగా మారింది.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
నిన్న మొన్నటి వరకు బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే సీఎం కేసీఆర్పై పోటీకి సై అంటూ వచ్చారు ఈటల రాజేందర్. అలాంటిది ఒక్కసారిగా తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించి సంచలనం రేపారు. ఈ అంశంపై ఇతర పార్టీల కంటే ఎక్కువ చర్చ జరుగుతోంది బీజేపీలోనే. గజ్వేల్లో పని ప్రారంభించానని.. ఆ నియోజకవర్గంపై కన్నేసినట్టు ఈటల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్లో సీఎం కేసీఆర్ను ఓడిస్తానని ప్రకటించారాయన. మరో సువేందు అధికారిని అవుతానని బెంగాల్లో మమత బెనర్జీని ఓడించిన అంశాన్ని ప్రస్తావించారు ఈటల. దీంతో బీజేపీలో కొత్త సంప్రదాయానికి తెరలేపారని అనుకుంటున్నారు.
ఇదే సమయంలో ఈటల ప్రకటనపై బీజేపీలో ఇంకో చర్చ కూడా జరుగుతోంది. హుజురాబాద్ను ఆయన వదులుకొనే ప్రసక్తే లేదని.. అలాంటిది గజ్వేల్కు ఎలా వెళ్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే.. జాతీయ నేతల అనుమతితో ఈటల ఆ ప్రకటన చేశారని అభిప్రాయపడేవాళ్లూ ఉన్నారు. ఈ అంశంపై పార్టీ వర్గాలకే క్లారిటీ లేదట. రేపటి రోజున ఈటలను చూసి మరోనేత.. తాను హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని చెబితే పరిస్థితి ఏంటి అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారట. అయినా.. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి దగ్గరకు మమత బెనర్జీ వెళ్లింది తప్పితే.. మమతా బెనర్జీపై పోటీ చేస్తానని సువేందు సవాల్ చేయలేదని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. సీటు విషయంలో స్పష్టత లేకపోవడం వల్లే చాలా మంది బీజేపీలో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారని.. అలాంటిది ఈటల అలా ఎలా ప్రకటన చేస్తారని కరుడుగట్టిన నేతలు నిలదీస్తున్నారట. మరి.. ఈటల ప్రకటన వెనక అసలు సంగతేంటో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!