కర్ణాటకలోని మంగళూరు జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూ యువతులతో తిరుగుతున్నందుకు ముస్లిం యువకులను దారుణంగా కొట్టారు. మంగళూరు జిల్లాలోని సోమేశ్వర్ బీచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీని తిరిగి కేటాయించారు.
లేటు వయస్సులో ఘాటు ప్రేమతో ఓ రేంజులో వివాదాలను సృష్టించిన ముదురు జంట పవిత్ర-నరేష్.. ఎవరెన్ని విమర్శలు చేసినా అవి మాకు ఆశీస్సులు అంటూ ఇంకాస్త రెచ్చిపోతున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ మూడో భార్యకు విడాకులు ఇచ్చి పవిత్రతో సహజీవనం మొదలు పెట్టాడు..అంతేకాదు ఇద్దరు కలిసి ‘మళ్లీ పెళ్లి ‘ అనే సినిమాను కూడా తీశారు.. ఆ సినిమా ఇటీవల విడుదలయ్యి మిశ్రమ టాక్ ను అందుకుంది.. ఇక వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు…
Amul: కర్ణాటక, తమిళనాడు తర్వాత ఇప్పుడు అమూల్ పాలపై పోరాటం మహారాష్ట్రకు చేరింది. రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారుల సంఘాలు తమ ఉనికిని కాపాడుకునేందుకు అమూల్కు వ్యతిరేకంగా నిలబడాలని మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ విజ్ఞప్తి చేశారు.
Trainee Aircraft Emergency Landing: ఈ మధ్య కాలంలో విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అందులోనూ శిక్షణా విమానాల్లో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. శిక్షణా విమానం గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా వ్వవసాయ క్షేత్రంలో ల్యాడ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. కర్ణాటకలోని బెలగావిలో గల సాంబ్రా విమానాశ్రయం నుంచి సోమవారం రెడ్బర్డ్ శిక్షణా విమానం ఉదయం 9.30 గంటలకు టేకాఫ్ అయింది. అయితే గాలిలోకి ఎగిరిన…
కర్ణాటకలో కొత్తగా ఏర్పాడిన సిద్ధరామయ్య సర్కార్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. బెంగళూరులోని రాజ్భవన్లో 24మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 224 సీట్లకు గానూ 135 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది.
బెంగళూరులో రుతుపవనాలకు ముందు వర్షాలు వినాశనం కలిగిస్తూనే ఉన్నాయి, ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో 52 మరణాలు నమోదయ్యాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. చెట్లు కూలడం వల్ల కొంత మంది ప్రాణాలు కోల్పోగా, పిడుగులు పడి కొందరు వర్షపు నీటిలో కొట్టుకుపోయి మరణించారు.