Karnataka: కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. కరెంట్ బిల్లులు కట్టం, బస్సులో టికెట్ తీసుకోం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 224 సీట్లకు గానూ 135 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. అయితే ఈ గెలుపులో కాంగ్రెస్ ప్రకటించిన 5 హామీలు చాలా కీలకంగా మారాయి. 200 యూనిట్లలోపు విద్యుత్ ఉచితంతో పాటు, ప్రభుత్వ రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచితంగా ప్రయాణం వంటి హామీలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి ప్రజలు ఈ హామీల కోసం డిమాండ్ చేస్తున్నారు.
Read Also: AI face-swapping: AI ఫేస్-స్వాపింగ్ టెక్నాలజీతో భారీ మోసం.. స్నేహితుడిలా నటించి రూ.5 కోట్లకు టోకరా..
Also Read
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
- Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
గ్రామాల్లో కరెంట్ బిల్లుల వసూలు చేసేందుకు వచ్చే విద్యుత్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. మాకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది, వారే మా బిల్లులు కడుతారని ప్రజలు చెబుతున్నారు. బెళగావిలోని ఓ గ్రామంలో కొందరు వ్యక్తులు కరెంటు బిల్లులు చెల్లించేందుకు నిరాకరించారు. కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిందని ప్రజలు చెబుతున్నారు. కొప్పల్, కలబురగి, చిత్రదుర్గ జిల్లాల్లోని గ్రామస్థులు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కొప్పల్ ప్రాంతంలో గత 6 నెలలుగా రూ.9000 విద్యుత్ బిల్లు కట్టాలని కోరిన విద్యుత్ ఉద్యోగులపై ఆ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే రాయచూర్ లో ఓ మహిళ బస్సులో టికెట్ తీసుకునేందుకు నిరాకరించింది. టికెట్ కోసం డబ్బులు ఇవ్వకపోవడంతో సదరు మహిళ బస్సు కండక్టర్తో వాగ్వాదానికి దిగింది. బస్సు టికెట్ కొనడానికి నిరాకరించిన మహిళ.. మేము డబ్బులు చెల్లించాల్సి వస్తే కాంగ్రెస్ ఎందుకు ఉచితం అని ప్రకటించింది..? అని ప్రశ్నించింది. మస్కీ-సింథనూర్ బస్సులో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ ప్రకటించిన హామీలను అమలు చేస్తే ఏటా రూ.50,000 కోట్ల ఖజానాకు బొక్కపడుతుంది.
Women strongly argues with bus conductor in Karnataka, says she will not buy ticket.
"If we have to pay money, why did they announce its free, are they mad".pic.twitter.com/WyLhF4XRuj— Dr AishwaryaS (@Aish17aer) May 23, 2023
తాజావార్తలు
-
Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!