Bengaluru Rains: బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం.. హైఅలర్ట్ ప్రకటించిన అధికార యంత్రాంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Rains: బెంగళూరులో రుతుపవనాలకు ముందు వర్షాలు వినాశనం కలిగిస్తూనే ఉన్నాయి, ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో 52 మరణాలు నమోదయ్యాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. చెట్లు కూలడం వల్ల కొంత మంది ప్రాణాలు కోల్పోగా, పిడుగులు పడి కొందరు వర్షపు నీటిలో కొట్టుకుపోయి మరణించారు. వాతావరణ పరిస్థితులు మరింత దిగజారుతున్నందున బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) నగరం అంతటా తాత్కాలిక రుతుపవన నియంత్రణ గదులను ఏర్పాటు చేసే ప్రణాళికను రూపొందించినట్లు తెలిసింది. నివేదికల ప్రకారం, సబ్ డివిజనల్ స్థాయిలో 63 కంట్రోల్ రూమ్లను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. జూన్ 1వ తేదీ నాటికి వీటిని అమలులోకి తీసుకురానున్నారు. కొత్తగా ఉద్భవిస్తున్న సింక్హోల్లు, వరదలతో నిండిన వీధులతో సహా, మౌలిక సదుపాయాల స్థాయిలో నగరం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. బెంగళూరులోని అత్యంత కష్టతరమైన ప్రాంతాలలో ఒకటైన సిలికాన్ సిటీ ప్రాంతంలోని బీటీఎం లేఅవుట్లో 4 అడుగుల లోతులో ఒక సింక్హోల్ ఏర్పడినట్లు నివేదించబడింది.
వర్షాల మధ్య విపత్తు నిర్వహణపై చర్చించేందుకు సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన మంగళవారం అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు (డీసీలు), జిల్లా పంచాయతీల సీఈవోలతో సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తాను హాజరైన సమావేశాన్ని పోస్ట్ చేసిన సిద్ధరామయ్య.. వర్షాల వల్ల ఆస్తులకు కూడా గణనీయమైన నష్టం జరిగిందని, తక్షణమే సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రీ మాన్సూన్ జల్లులు అనేక భాగాలలో ప్రారంభమయ్యాయి, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ముందస్తు రుతుపవనాలు ఉంటాయి. ఈసారి రుతుపవనాలకు ముందు వర్షాలు సాధారణం కంటే 10 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 52 మంది ప్రాణాలు కోల్పోగా, 331 పశువుల నష్టం, 20,000 హెక్టార్లలో పంట నష్టం, 814 ఇళ్లు దెబ్బతిన్నాయని సమావేశం అనంతరం సిద్ధరామయ్య విలేకరులతో అన్నారు. మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Read Also: Cannes Film Festival: కేన్స్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటన.. ఒంటిపై రక్తం పోసుకొని..
ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించామని, పశువుల నష్టానికి ఉపశమనం కల్పించాలని, ఇళ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణ సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.వర్షం సమయంలో నీరు నిలిచిపోయే అండర్పాస్లను ట్రాఫిక్ కోసం మూసివేయాలని, దానిని శాస్త్రీయంగా క్లియర్ చేయాలని, తక్షణ విపత్తు సహాయక చర్యలను ప్రారంభించడానికి అధికారులకు సమాచారం అందించామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి, వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని డీసీలు, సీఈవోలను ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
బెంగళూరులో అండర్పాస్లో మునిగి ఇన్ఫోసిస్ టెక్కీ మృతి
కర్నాటకలోని అధికార పీఠమైన విధాన సౌధ నుంచి కొంచెం దూరంలో ఉన్న కేఆర్ సర్కిల్ అండర్పాస్ వద్ద తన కుటుంబంతో ప్రయాణిస్తున్న కారు మెడలోతు నీటిలో కూరుకుపోవడంతో 22 ఏళ్ల మహిళ ఆదివారం మునిగిపోయింది. నగరం నడిబొడ్డున వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది కుటుంబంలోని మరో ఐదుగురిని, డ్రైవర్ను రక్షించారు. బాధితురాలితో పాటు ఇతరులను సెయింట్ మార్తాస్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, భానురేఖ అనే మహిళ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే?
రాబోయే కొద్ది రోజుల్లో కర్ణాటకతో సహా దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. “రాబోయే 5 రోజులలో దక్షిణ భారత్లోని పలు ప్రాంతాలలో తేలికపాటి/మోస్తరుగా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ. మాహే, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రా, పుదుచ్చేరి, కారైకాల్, లక్షద్వీప్లలో వచ్చే 5 రోజులలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!