కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మెటా సంస్థ చంపేసింది. ఇటీవల ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూశారు. ఆమె మృతికి సంతాపం తెల్పుతూ సిద్ధరామయ్య కన్నడలో ఒక పోస్ట్ పెట్టారు.
వాళ్లిద్దరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2024లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పెళ్లైన కొంత కాలం తర్వాత తన భార్య తనును బలవంతంగా మతం మార్చిందని ఆరోపించాడు. ఈ ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లాలో వెలుగుచూసింది. తహసీన్ హోసమణితో తనకు మూడేళ్లుగా సంబంధం ఉందని విశాల్ కుమార్ గోకవి తెలిపాడు. ఆ తర్వాత 2024 నవంబర్లో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నామని వెల్లడించాడు. Also Read:Bojjala Sudhir Reddy:…
Movie Ticket Prices: సినిమాలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా, కుటుంబ సమయాన్ని గడిపేందుకు ఓ మార్గం. ముఖ్యంగా వారం రోజుల పని ఒత్తిడి నుండి బయట పడేందుకు, కొందరు కుటుంబ సభ్యులతో పాటు బయటికి వెళ్లే సరదా మూమెంట్స్లో సినిమాలు ప్రధాన భాగంగా నిలుస్తున్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో థియేటర్లలో టికెట్ ధరలు అధికంగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలకు ఇది కాస్త భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
ఒడిశాలో జరిగిన ఘోర సంఘటనను మరువక ముందే బెంగళూరులో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులపై తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, బ్లాక్ మెయిల్ చేశారని కాలేజీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దాదాపుగా 100 మంది ఎమ్మెల్యేలు డీకే.శివకుమార్కు మద్దతు ఇస్తున్నారని ఇటీవల ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. సిద్ధరామయ్యపై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసును న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. 2023 ఎన్నికల సమయంలో ‘‘అవినీతి రేటు కార్డు’’ ప్రకటనపై బీజేపీ పరువు నష్టం కేసు దాఖలు చేసింది.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రకటన చేశారు. డీకే. శివకుమార్కు 100 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు జరగకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు మీడియాతో చెప్పారు.
కర్ణాటక రాష్ట్రాన్ని ఆకస్మిక మరణాలు హడలెత్తిస్తున్నాయి. ఎక్కువగా యువకులే గుండెపోటుతో మరణిస్తున్నారు. గత జూన్ నెలలో హసన్ జిల్లాలో 23 మంది హార్ట్ఎటాక్తో ప్రాణాలు కోల్పోయారు.
Bengaluru: బెంగళూర్లో దారుణం చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య గొడవ భార్య హత్యకు దారి తీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం కారణంగా కోపంతో భర్త భార్యను హత్య చేశాడు. భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో చనిపోయే వరకు తొక్కుతూ చంపాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది... దీంతో పెద్ద ఎత్తున వచ్చి ఇన్ఫ్లో రూపంలో తుంగభద్ర డ్యామ్లోకి వచ్చి చేరుతుంది.. అధిక ప్రమాణంలో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.