DK Shivakumar: డీకే.శివకుమార్లో నైరాశ్యం.. కార్యకర్తగా ఉంటే బెటర్ అంటూ కామెంట్
- పవర్ షేరింగ్పై డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- రాహుల్గాంధీని విసిగించదల్చుకోలేదని వ్యాఖ్య
- పార్టీ కార్యకర్తగా ఉండడం ఇష్టమంటూ కామెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు డీకే.శివకుమార్ చాలా కృషి చేశారు. రాష్ట్రమంతా తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తీరా కాంగ్రెస్ విజయం సాధించాక సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని తన్నుకుపోయారు. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే.శివకుమార్కు అడియాసలే మిగిలాయి.
ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. దీంతో మిగిలిన రెండున్నరేళ్లైనా ముఖ్యమంత్రి కుర్చీ దక్కుతుందని ఆశ పెట్టుకున్నారు. హస్తినలో తిట్టవేసి హైకమాండ్ పెద్దలతో చర్చలు జరిపారు. అక్కడా కూడా ఫలితమివ్వలేదు. బెంగళూరులోకి షిఫ్ట్ అయి బేక్ఫాస్ట్లుగా మారింది. ఒకసారి సిద్ధరామయ్య ఇంట్లో.. ఇంకోసారి డీకే.శివకుమార్ ఇంట్లో అల్పాహర విందులు జరిగాయి. కానీ పురోగతి లేదు. ఇటీవల సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించారు. దీంతో డీకే.శివకుమార్ గుండెలో పిడుగు పడినట్లైంది.
Also Read
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
- Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
ఇది కూడా చదవండి: Cambodia: కంబోడియాలో విష్ణువు విగ్రహం కూల్చివేత.. భారత్ అభ్యంతరం
తాజాగా డీకే.శివకుమార్ నైరాశ్యం వ్యక్తం చేశారు. పదవుల కంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండటమే తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని కర్ణాటక భవన్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 1980 నుంచి పార్టీ కోసం అవిశ్రాంతంగా పని చేస్తూ వస్తున్నానని.. ఇప్పటికీ అదే కార్యకర్తగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. బ్రేక్ఫాస్ట్ సందర్భంగా ఎలాంటి చర్చలు జరిగాయో చెప్పలేనన్నారు. సంక్రాంతి తర్వాత పవర్ షేరింగ్ ఉండొచ్చా? అని అడిగిన ప్రశ్నకు అలాంటి వార్తలు మీడియాలోనే వస్తాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నాయకత్వ మార్పు అంశాలపై విదేశాల నుంచి వచ్చిన రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టదల్చుకోలేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Bangladesh: ఉద్రిక్తతల వేళ 17 ఏళ్ల తర్వాత తారిఖ్ రెహమాన్ రాక.. లక్షలాది మంది స్వాగతం
తాజావార్తలు
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
-
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!