DK Shivakumar: డీకే.శివకుమార్లో నైరాశ్యం.. కార్యకర్తగా ఉంటే బెటర్ అంటూ కామెంట్
- పవర్ షేరింగ్పై డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- రాహుల్గాంధీని విసిగించదల్చుకోలేదని వ్యాఖ్య
- పార్టీ కార్యకర్తగా ఉండడం ఇష్టమంటూ కామెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు డీకే.శివకుమార్ చాలా కృషి చేశారు. రాష్ట్రమంతా తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తీరా కాంగ్రెస్ విజయం సాధించాక సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని తన్నుకుపోయారు. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే.శివకుమార్కు అడియాసలే మిగిలాయి.
ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. దీంతో మిగిలిన రెండున్నరేళ్లైనా ముఖ్యమంత్రి కుర్చీ దక్కుతుందని ఆశ పెట్టుకున్నారు. హస్తినలో తిట్టవేసి హైకమాండ్ పెద్దలతో చర్చలు జరిపారు. అక్కడా కూడా ఫలితమివ్వలేదు. బెంగళూరులోకి షిఫ్ట్ అయి బేక్ఫాస్ట్లుగా మారింది. ఒకసారి సిద్ధరామయ్య ఇంట్లో.. ఇంకోసారి డీకే.శివకుమార్ ఇంట్లో అల్పాహర విందులు జరిగాయి. కానీ పురోగతి లేదు. ఇటీవల సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించారు. దీంతో డీకే.శివకుమార్ గుండెలో పిడుగు పడినట్లైంది.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
ఇది కూడా చదవండి: Cambodia: కంబోడియాలో విష్ణువు విగ్రహం కూల్చివేత.. భారత్ అభ్యంతరం
తాజాగా డీకే.శివకుమార్ నైరాశ్యం వ్యక్తం చేశారు. పదవుల కంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండటమే తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని కర్ణాటక భవన్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 1980 నుంచి పార్టీ కోసం అవిశ్రాంతంగా పని చేస్తూ వస్తున్నానని.. ఇప్పటికీ అదే కార్యకర్తగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. బ్రేక్ఫాస్ట్ సందర్భంగా ఎలాంటి చర్చలు జరిగాయో చెప్పలేనన్నారు. సంక్రాంతి తర్వాత పవర్ షేరింగ్ ఉండొచ్చా? అని అడిగిన ప్రశ్నకు అలాంటి వార్తలు మీడియాలోనే వస్తాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నాయకత్వ మార్పు అంశాలపై విదేశాల నుంచి వచ్చిన రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టదల్చుకోలేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Bangladesh: ఉద్రిక్తతల వేళ 17 ఏళ్ల తర్వాత తారిఖ్ రెహమాన్ రాక.. లక్షలాది మంది స్వాగతం
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!