భారతదేశంలో 355 కొత్త కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల ఒక్క రోజు పెరుగుదల నమోదైంది. దేశంలో ఇప్పుడు క్రియాశీల కేసుల సంఖ్య 2,331 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.. శుక్రవారం INSACOG ప్రకారం, దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,378 COVID-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు నమోదయ్యాయి, మణిపూర్ దాని ఉనికిని గుర్తించిన తాజా రాష్ట్రంగా అవతరించింది.. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) అనౌన్స్ చేసిన డేటా ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా 320…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బెంగళూర్లో నెలకొల్పుతున్న కొత్త కొత్త బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (BIETC) క్యాంపస్ ప్రారంభోత్సవంలో శుక్రవారం పాల్గొన్నారు. 43 ఎకరాల స్థలంలో రూ. 1,600 కోట్లతో నిర్మించిన అత్యాధునిక ఫెసిలిటీని ప్రధాని ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి మూడు రాష్ట్రాల్లోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
Karnataka: రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం దగ్గర పడుతున్నా కొద్ది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి రాజన్న కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రెండు బొమ్మల్ని టెంటులో ఉంచి వాటినే రాముడని అన్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Haveri Incident: కర్ణాటకలో మతాంతర జంట హోటల్ గదిలో ఉండగా.. ముస్లింమూక వారిపై దాడి చేసింది. ఏడుగురు నిందితులు వారిని తిడుతూ, తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోని హవేరి ప్రాంతంతో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో బాధిత యువతిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి ఆరోపణలతో పోలీసులు అత్యాచారం కేసును నమోదు చేశారు.
9th Class Student of Govt School in Karnataka Delivers Baby: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్లో ఉంటున్న 14 ఏళ్ల బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో చోటుచేసుకుంది. జనవరి 9న ఈ ఘటన జరగ్గా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.…
Suchana Seth: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ సీఈఓ సుచనా సేథ్ కేసుల యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కొడుకని చూడకుండా.. నాలుగేళ్ల పిల్లాడిని అత్యంత క్రూరంగా హతమార్చింది. కొడుకు మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని గోవా నుంచి కర్ణాటకకు వెళ్తుండగా.. గోవా పోలీసులు ఆమెను చిత్రదుర్గలో అరెస్ట్ చేశారు. నిందితురాలు జనవరి 6న గోవాలోని కాండోలిమ్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో తన కొడుకు గొంతు నులిమి చంపింది. ఈ ఘటన తర్వాత ఆమె కూడా చనిపోయేందుకు ప్రయత్నించిందని కేసు…
Karnataka: కర్ణాటకలో మతాంతర జంటలపై దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల బెళగావిలో ఇటీవల ఇలాగే ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతితో కలిసి ఉండగా.. మైనారిటీ వర్గానికి చెందిన 10 మందికి పైగా వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఎందుకు అమ్మాయితో కలిసి ఉన్నావంటూ ఓ గదికి తీసుకెళ్లి చితకబాదారు. ఈ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
ఈ మధ్య పిల్లలను కొందరు పేరెంట్స్ గాలికి వదిలేస్తున్నారు.. వయస్సుతో సంబంధం లేకుండా వారికి అడిగినంత డబ్బులు ఇవ్వడం లేదా వాహనాలను ఇస్తూ రోడ్ల మీదకు పంపిస్తున్నారు.. తాజాగా అలాంటి ఘటనే బెంగుళూరు లో వెలుగు చూసింది.. బెంగళూరులో రద్దీ రోడ్ల పై ఓ మైనర్ కుర్రాడు కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన విజివల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. బెంగళూరులో రద్దీగా ఉండే ప్రదేశంలో మహీంద్రా థార్ చక్రం వెనుక ఉన్న చిన్న పిల్లవాడి…
Karnataka: బెంగళూర్లోని కర్ణాటక అసెంబ్లీ ముందు 8మంది కుటుంబ సభ్యులు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు అప్పు తీర్చనందుకు తమ ఇంటిని బ్యాంకు వేలం వేయడంతో బాధలో ఆ కుటుంబ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది.