Karnataka: పబ్లిక్ ఎగ్జామ్పై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో (karnataka) పరీక్ష సమయాల మార్పుపై (Exam timings) అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎస్ఎస్ఎల్సీ, ప్రీ యూనివర్సిటీ పరీక్షల సమయాలను సర్దుబాటు చేస్తూ మైనారిటీలను మభ్యపెడుతోందని బీజేపీ ఆరోపించింది.
ఇటీవల SSLC మరియు ప్రీ-యూనివర్శిటీ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. అయితే శుక్రవారం మాత్రం SSLC పరీక్షా సమయం ఉదయం నుంచి మధ్యాహ్నానికి మార్చారు. దీంతో ప్రతిపక్ష పార్టీ బీజేపీ (BJP) మండిపడింది. అన్ని పరీక్షలు ఉదయం నిర్వహించి శుక్రవారం మాత్రం షెడ్యూల్కు భిన్నంగా మధ్యాహ్నం ఎందుకు నిర్వహిస్తున్నారంటూ నిలదీసింది. ముస్లిం సమాజాన్ని శాంతింపజేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, ఉదయం నమాజ్ చేసుకునేందుకు వీలుగానే సమయం మార్చారని బీజేపీ అధికార ప్రతినిధి హరిప్రకాష్ ఆరోపించారు.
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- 12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
- Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
బీజేపీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ (Congress) ఖండించింది. వేరే పరీక్షా సమయాలను సర్దుబాటు చేయడానికి ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 1న పీయూసీ పరీక్ష ప్రారంభం కావడంతో అదే రోజు మధ్యాహ్నం ఎస్ఎస్ఎల్సీ పరీక్ష జరగనుంది. పరీక్షల సమయాన్ని సర్దుబాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.
SSLC కోసం ప్రిపరేటరీ పరీక్షలు ఫిబ్రవరి 26న ప్రారంభమై మార్చి 2న ముగియనుండగా, పీయూసీ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!