Rahul Gandhi: కర్ణాటకలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ‘‘40% కమీషన్’’ ఆరోపణలు సహకరించాయి. బీజేపీ ప్రభుత్వం ప్రతీ విషయంలో కమీషన్ తీసుకుంటుందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే, ఈ ఆరోపణలపై బీజేపీ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు కోర్టు సమన్లు జారీ చేసింది.
కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం దేవాలయాలు కూడా పన్ను కట్టాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఉద్రిక్త కొనసాగుతుంది. ఇక, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ మరోసారి గళం విప్పింది.
Karnataka: కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఇప్పుడు ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కర్ణాటక హోం మినిస్టర్ బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడుతూ.. ఈ సారి ముస్లిం సమాజానికి బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఎక్కువ ఇచ్చామని అన్నారు. దీనిపై బీజేపీ అభ్యంతరం తెలుపుతోంది. మంత్రి వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు తప్పుపట్టారు. ఇది వివక్ష అంటూ విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ (PM Modi) మూడోసారి గెలిస్తే ఇకపై ఎన్నికలు ఉండవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాష్ట్రంలో తన పెళ్లం ఇన్స్టాగ్రామ్కు బానిస అయిందనే ఆవేదనతో భర్త సూసైడ్ చేసుకున్నారు. అయితే, తన భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడంపై ఉన్న వ్యామోహంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు భర్త కుమార్ ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టింది.. దీంతో ఇద్దరికీ తరచూ గొడవలు అవుతుండటంతో మనస్తాపం చెందిన భర్త హనురూలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
పశ్చిమ కనుమల్లో కప్ప శరీరంపై పుట్టగొడుగులు పెరిగిన ఘటనతో శాస్త్రవేత్తలు అయోమయంలో పడ్డారు. ఒక జీవి శరీరంపై ఇలా కనిపించడం ఇదే తొలిసారి. ఈ జీవిని జూన్ 19న కర్ణాటకలోని కర్కాలలో గుర్తించారు.
శాంతిభద్రతల పరిస్థితిపై కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కర్ణాటక గూండాల రాష్ట్రంగా మారిందని ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఆరోపించింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బతికే ఉందా, చచ్చిందా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు.
కర్ణాటకలోని కొప్పల్లో దారుణ ఘటన చేసుకుంది. భర్త కళ్లేదుటే ఆరుగురు వ్యక్తులు 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె భర్తను విచక్షణారహితం కొట్టారని బాధితురాలు తెలిపింది.