DK Shivakumar: మా ఇంటి బోరుబావి కూడా ఎండిపోయింది.. బెంగళూరు నీటి సమస్యపై డిప్యూటీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగిన నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరులోని అన్ని ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, తన ఇంటి వద్ద ఉన్న బోరుబావి కూడా ఎండిపోయిందన్నారు. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నగరంలో నీటి సరఫరా జరిగేలా చూస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు.
Read Also: Amit Shah: ప్రధాని చంద్రయాన్ను ప్రారంభిస్తే.. సోనియా ‘రాహుల్యాన్’ను ప్రయోగిస్తున్నారు..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
అతి తక్కువ వర్షపాతం కారణంగా బోర్లు ఎండిపోవడంతో బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. రెసిడెన్షియల్ సొసైటీల్లో నివాసం ఉంటున్న వారు రోజువారీ అవసరాలకు నీటిని వినియోగించుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సంక్షోభం మధ్య, చాలా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు నీటికి బదులుగా నివాసితుల నుంచి ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కొన్ని ట్యాంకర్లు రూ.600లకు నీరు ఇస్తున్నారని, మరికొందరు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. నీటి ధరలను ప్రామాణికం చేసేందుకు, అన్ని నీటి ట్యాంకర్లను అధికారులతో నమోదు చేసుకోవాలని మేము కోరామన్నారు. ట్యాంకర్లు ప్రయాణించే దూరాన్ని బట్టి నీటి ధరలను నిర్ణయిస్తారు.
Read Also: Taiwan Minister: భారతీయులపై ‘జాత్యహంకార’ వ్యాఖ్యలపై తైవాన్ మంత్రి క్షమాపణలు
కేంద్రంపై డిప్యూటీ సీఎం..
ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, బెంగళూరులో నీటి సమస్యను పరిష్కరించగల మేకేదాటు రిజర్వాయర్ ప్రాజెక్టును నిలిపివేసిందని ఆరోపించారు. బెంగళూరుకు నీరు అందాలనే ఉద్దేశ్యంతో మేకేదాటు ప్రాజెక్టును ప్రారంభించామని చెప్పారు. మా పాదయాత్రతో మేకేదాటు ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా ఆమోదం లభించలేదు. నీటి ఎద్దడి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కనీసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కోరారు. కరువు సమస్యపై ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, ఆర్డీపీఆర్ మంత్రి, ఇతర మంత్రులతో చర్చించామని డీకే శివకుమార్ తెలిపారు. పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు నగరాలకు 15 కిలోమీటర్ల పరిధిలోని నీటి వనరులను ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. అదేవిధంగా రామనగర, హోసకోట్, చన్నపట్న, మాగాడి తదితర నగరాల నుంచి నీటి ట్యాంకర్లతో బెంగళూరు నగరానికి నీటిని తీసుకురావాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!