DK Shivakumar: మా ఇంటి బోరుబావి కూడా ఎండిపోయింది.. బెంగళూరు నీటి సమస్యపై డిప్యూటీ సీఎం..
DK Shivakumar: కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగిన నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరులోని అన్ని ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, తన ఇంటి వద్ద ఉన్న బోరుబావి కూడా ఎండిపోయిందన్నారు. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నగరంలో నీటి సరఫరా జరిగేలా చూస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు.
Read Also: Amit Shah: ప్రధాని చంద్రయాన్ను ప్రారంభిస్తే.. సోనియా ‘రాహుల్యాన్’ను ప్రయోగిస్తున్నారు..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
అతి తక్కువ వర్షపాతం కారణంగా బోర్లు ఎండిపోవడంతో బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. రెసిడెన్షియల్ సొసైటీల్లో నివాసం ఉంటున్న వారు రోజువారీ అవసరాలకు నీటిని వినియోగించుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సంక్షోభం మధ్య, చాలా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు నీటికి బదులుగా నివాసితుల నుంచి ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కొన్ని ట్యాంకర్లు రూ.600లకు నీరు ఇస్తున్నారని, మరికొందరు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. నీటి ధరలను ప్రామాణికం చేసేందుకు, అన్ని నీటి ట్యాంకర్లను అధికారులతో నమోదు చేసుకోవాలని మేము కోరామన్నారు. ట్యాంకర్లు ప్రయాణించే దూరాన్ని బట్టి నీటి ధరలను నిర్ణయిస్తారు.
Read Also: Taiwan Minister: భారతీయులపై ‘జాత్యహంకార’ వ్యాఖ్యలపై తైవాన్ మంత్రి క్షమాపణలు
కేంద్రంపై డిప్యూటీ సీఎం..
ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, బెంగళూరులో నీటి సమస్యను పరిష్కరించగల మేకేదాటు రిజర్వాయర్ ప్రాజెక్టును నిలిపివేసిందని ఆరోపించారు. బెంగళూరుకు నీరు అందాలనే ఉద్దేశ్యంతో మేకేదాటు ప్రాజెక్టును ప్రారంభించామని చెప్పారు. మా పాదయాత్రతో మేకేదాటు ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా ఆమోదం లభించలేదు. నీటి ఎద్దడి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కనీసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కోరారు. కరువు సమస్యపై ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, ఆర్డీపీఆర్ మంత్రి, ఇతర మంత్రులతో చర్చించామని డీకే శివకుమార్ తెలిపారు. పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు నగరాలకు 15 కిలోమీటర్ల పరిధిలోని నీటి వనరులను ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. అదేవిధంగా రామనగర, హోసకోట్, చన్నపట్న, మాగాడి తదితర నగరాల నుంచి నీటి ట్యాంకర్లతో బెంగళూరు నగరానికి నీటిని తీసుకురావాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో