Bengaluru water crisis: బెంగళూర్లో తీవ్ర నీటి సంక్షోభం.. డిస్పోజబుల్ ప్లేట్లు, వెట్ వైప్స్ వాడాలని కోరుతున్న గేటెడ్ కమ్యూనిటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిలికాన్ సిటీ బెంగళూర్ వేసవి కాలం పూర్తిగా రాకముందే తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలోని పలు ప్రాంతాలు నీటి కొరతను చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని డ్రై ప్లేసెస్కి నీటిని సరఫరా కోసం ప్రైవేట్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రోజూవారీ నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడే ప్రైవేట్ అపార్ట్మెంట్ల సమస్యను మరింత తీవ్రతరం చేసింది. కనకపురా రోడ్లోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ నీటి సంక్షోభం నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ ఆదేశాలు అక్కడి వాటర్ క్రైసిస్ని తెలియజేస్తుంది. కమ్యూనిటీ సభ్యులు డిస్పోజబుల్ ప్లేట్లు, వెట్ వైప్లను ఉపయోగించాలని కోరింది.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
కమ్యూనిటీ సంఘం అధ్యక్షుడు వసంత్ కుమార్ మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లోనే ఈ చర్యలు తీసుకోవాలని సూచించామని చెప్పారు. 2,500 యూనిట్లను కలిగి ఉన్న ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ, రెసిడెంట్స్ అసోసియేషన్ అంతర్గత మెసేజుల్లో ఈ ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. నీటి లభ్యత లేని తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు అధికారులు అన్ని ట్యాంకర్లను ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో వర్షాకాలం వచ్చేందుకు మరో 4 నెలల సమయం ఉండటంతో నీటిని సంరక్షించడానికి తగు చర్యలు చేపట్టాలని అపార్ట్మెంట్లలోని నివాసితులను కోరారు.
పలువురు టవర్ కాకుండా బకెట్ ద్వారా నీటిని పట్టుకుని స్నానం చేస్తున్నారు. మరికొందరు ఆర్ఓ ప్యూరిఫైయర్ నుంచి వచ్చే మురికి నీటిని కూడా ఆదా చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే భార్యభర్తలు, స్కూల్ పిల్లలు ఉన్న కుటుంబాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. బెంగళూర్లో తీవ్రమైన నీటి కొరతను పరిష్కరించడానికి సివిల్ అడ్మినిస్ట్రేషన్ వార్రూమ్ ఏర్పాటు చేసినట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మార్చి 4న తెలిపారు. నగరంలో నీటి కొరతకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి BBMP హెల్ప్లైన్లు మరియు వార్డుల వారీ ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యతని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శివకుమార్ చెప్పారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!