రూ.2,500 కోట్లు ఇస్తే సీఎం పదవి ఇప్పిస్తామంటూ కొందరు ఆఫర్ చేశారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మండిపడ్డారు. కర్ణాటక సీఎం పదవి వేలానికి పెట్టారా.. డబ్బులిస్తే చాలు.. ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేస్తారా అంటూ ఆయన నిలదీశారు. సీఎం సీటు ఏమైనా పేమెంట్ సీటా అని ప్రశ్నించారు. బసనగౌడ వ్యాఖ్యలపై తక్షణం దర్యాప్తు జరపాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఒకవేళ విచారణ జరపకుంటే బసవరాజ్…
ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 9 నెలలే గడిచింది.. ఇప్పుడు ఆయన్ని మార్చేపనిలో పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.. దీనికి కారణం లేకపోలేదు.. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. కింది నుంచి పై స్థాయి వరకు తాము మార్పులు చేయాలనుకుంటే చేసేస్తామని, అందులో ఏమాత్రం సంకోచించడం లేదన్నారు.. గుజరాత్, ఢిల్లీ స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా.. ఆయన కామెంట్లపై ఇప్పుడు కర్ణాటకలో తీవ్రమైన చర్చసాగుతోంది..…
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే ఉంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరులో పర్యటించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రావణుడి అహంకారం లాగా.. కేంద్రానికి కూడా అహంకారం వుందని విమర్శించారు. అందుకే సాగు చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. రైతులతో చెలగాటాలొద్దని తాము బీజేపీని పదే పదే హెచ్చరించినా.. పెడ చెవిన పెట్టిందని, చివరికి…
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కెజిఎఫ్ 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్నిభాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్ళు రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇక యష్ ఫ్యాన్స్ థియేటర్లో చేసే రచ్చ మాములుగా లేదు. యష్ నటనకు, అతడు చెప్పే డైలాగ్స్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతూ ఈలలు, గోలలు చేస్తూ హంగామా చేస్తున్నారు. తాజాగా ఒక…
ఏదైనా ఒక సినిమా హిట్ అయితే కొన్నిరోజుల వరకు మ్యానియాలో ఉండిపోతారు అభిమానులు.. పుష్ప రిలీజ్ అయ్యాక తగ్గేదేలే, పార్టీలేదా పుష్ప అని మొదలుపెట్టారు.. ఆ తరువాత భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యాకా మనల్ని ఎవడ్రా ఆపేది అని స్టార్ట్ చేశారు.. ఇక ఆర్ఆర్ ఆర్ డైలాగ్స్ అయితే అసలు చెప్పనవసరం లేదు.. ఇక తాజాగా అభిమానులందరూ కెజిఎఫ్ 2 మ్యానియాలో పడ్డారు . ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి వయలెన్స్ డైలాగ్ ను వాడేస్తున్నారు.…
కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలా వద్దా అనేది పోలీసులు నిర్ణయిస్తారని సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిర్ణయం తీసుకునేదాకా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓపిక లేకపోతే ఎలా అంటూ బొమ్మై అసహనం వ్యక్తం చేశారు. వచ్చిన ఆరోపణలను సవాల్ గా తీసుకుని ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులపై ఆరోపణలు వచ్చినప్పుడు…
కర్ణాటకలోని హుబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వాట్సాప్ స్టేటస్ కారణంగా అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓల్డ్ హుబ్లీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా అభ్యంతరకర రీతిలో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో అల్లరి మూకలు ఏకంగా పోలీస్ స్టేషన్పై రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ సమయంలో ఇన్స్పెక్టర్ సహా పోలీసులు అక్కడే ఉన్నారు. వారు ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేసినా…
ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య వ్యవహారం ఆ మంత్రి మెడకు చుట్టుకుంది… ఆత్మహత్య చేసుకున్న సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్.. సూసైడ్ నోట్లో ఏకంగా మంత్రి పేరు పేర్కొన్నాడు.. తనకు రావాల్సిన బిల్లులో 40 శాతం కమిషన్ అడిగారనే ఆరోపణలు మంత్రిపై వచ్చాయి.. విపక్షాలు ఆందోళనకు దిగాయి.. దీంతో.. ఎకట్టేలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప… ఎట్టకేలకు రాజీనామా ప్రకటన చేశారు. ఇవాళ రాజీనామా లేఖను సీఎం బసవరాజ్ బొమ్మైకి అంద చేస్తానని గురువారం…
కర్నాటకలో ఎప్పుడూ హాట్ హాట్ రాజకీయాలు నడుస్తుంటాయి. తాజాగా మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ షాకిచ్చింది. అత్యంత వివాదాస్పదుడిగా, అవినీతిపరుడిగానూ పేరుపొందిన బీజేపీ మంత్రి ఈశ్వరప్పపై బీజేపీ వేటేసింది. మంత్రిగా ఉండి మతఘర్షణలకు ఊతమిస్తున్నారనే విమర్శలకు తోడు సామాన్యులను బెదిరించి, వారి మరణాలకూ కారకుడవుతున్నారని ఈశ్వరప్పపై అనేక ఆరోపణలున్నాయి. తాజాగా సంతోష్ పాటిల్ అనే గవర్నమెంట్ రోడ్డు కాంట్రాక్టర్ ఆత్మహత్య ఉదంతం దేశాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ వివాదంపై సీఎం స్పందించారు. దీనిపై వస్తున్న…
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. నిర్భయ తరహా ఘటనలు అడుగడుగునా జరుగుతున్నాయి. కర్ణాటకలో ఓ బాలికపై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. బాలికపై కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో కిమ్మనకుండా ఉండిపోయింది. https://ntvtelugu.com/breaking-news-young-lady-suicide-at-esi-metro-station/ ఏడుస్తూ వచ్చిన బాలికను తల్లిదండ్రులు ఆరాతీశారు. కబాబ్ తిన్నానని, అందులో కారంగా వుండడంతో ఏడిచానని…