All India Muslim Personal Law Board: ముస్లిం పర్సనల్ లాబోర్డ్ అత్యవసర సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపీ మసీదు అంశం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ ఉత్తర్వుల మేరకు మే 14-16 వరకు మసీదులో వీడియో సర్వే నిర్వహించి మే 17న రిపోర్ట్ ఇవ్వాలని కోర్ట్ నియమించిన కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ రోజే వీడియోగ్రఫీ సర్వే వివరాలను కోర్ట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే జ్ఞానవాపీ మసీదులోని వజూ ఖానాలోని బావిలో శివలింగ భయటపడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీడియో సర్వేకు మరింత సమయం కావాలని కోర్ట్ కమిషనర్లు వారణాసి కోర్ట్ ను కోరారు. మరోవైపు ఈ రోజు సుప్రీం కోర్ట్ లో జ్ఞానవాపి మసీదు సర్వేను నిలిపివేయాలని వేసిన పిటిషన్ పై విచారించనుంది.
ఇదిలా ఉంటే జరుగుతున్న పరిణామాలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ నేడు అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది. జ్ఞానవాపి మసీదుతో పాటు , కర్ణాటకలో జామియా మసీద్ విషయాలపై చర్చించనున్నారు. ఈ రెండు కేసులపై ఎలా మందుకు వెళ్లాలనే అంశాలపై పర్సనల్ లా బోర్డ్ చర్చించనుంది. మసీదు అంశాలతో పాటు దేశంలో ప్రస్తుత సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటించే అవకాశం ఉంది.
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
జ్ఞానవాపీ మసీదు అంశం కోర్ట్ పరిధిలో ఉంటే కర్ణాటకలో మరో కొత్త వివాదం రాజుకుంది. మాండ్యాలోని శ్రీరంగపట్టణలోని జామీయా మసీదు ఒకప్పుడు ఆంజనేయ దేవాలయం అని… తమకు పూజలు చేసుకునే అవకాశం ఇవ్వాలని నరేంద్రమోదీ విచార్ మంచ్ అనే గ్రూప్ మాండ్యా డిప్యూటి కమిషనర్ ను అనుమతి కోరింది. గతంలో టిప్పు సుల్తాన్ రాజధాని మైసూర్ కు 18 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మసీదు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. టిప్పు సుల్తాన్ హాయాంలో ఆంజనేయ స్వామి ఆలయంగా ఉన్నదాన్ని జామియా మసీదుగా మార్చారని.. ఇప్పటికీ మసీదుల్లోని పిల్లర్ల పై హిందూ శాసనాలు ఉన్నాయని నరేంద్ర మోదీ విచార్ మంచ్ సెక్రటరీ మంజునాథ్ ఆరోపిస్తున్నారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉండేదని చరిత్ర చెబుతోందని.. టిప్పు సుల్తాన్, పర్షియన్ రాజుకు రాసిన ఉత్తరాల్లో కూడా ఈ ఆలయం గురించి సాక్ష్యాలు ఉన్నాయని మంజునాథ్ అన్నారు.
తాజావార్తలు
-
Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!