Karnataka CM Basavaraj Bommai: అవసరమైతే కర్ణాటకలో ‘యోగి మోడల్’ సర్కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka CM Basavaraj Bommai: కర్ణాటకలో ఓ బీజేపీ కార్యకర్త హత్య విషయంపై పార్టీలోనూ, బయటా నెలకొన్న ఒత్తిళ్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో పరిస్థితులకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని.. ఒకవేళ పరిస్థితులుగానీ మారితే పరిస్థితులు డిమాండ్ చేస్తే కర్ణాటకలో కూడా ‘యోగి మోడల్’ ప్రభుత్వం అమలులోకి వస్తుందని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న దేశ వ్యతిరేక, మతతత్వ శక్తులను నియంత్రించేందుకు ఉత్తరప్రదేశ్ తరహాలో పాలన అమలు చేస్తామని హెచ్చరించారు.
ఇటీవల దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ యువజన విభాగం నేత ప్రవీణ్ నెట్టారు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య పార్టీలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాష్ట్ర ప్రభుత్వం తమను రక్షించలేకపోయిందని నిన్న యువ సభ్యులు సామూహిక రాజీనామా యాత్రను నిర్వహించారు. కేవలం ఏడాది పూర్తి చేసుకున్న బొమ్మై ప్రభుత్వం హిందూ కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించడం లేదని బీజేపీ, సంఘ్ పరివార్ మద్దతుదారులు ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, హిందూత్వ వాదుల ప్రాణాలు కాపాడుకొనేందుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, దక్షిణ కన్నడ జిల్లాలో బీజేవైఎం నేత ప్రవీణ్ హత్య కేసును సీరియస్గా తీసుకున్నామని.. ఐదు బృందాలను ఏర్పాటు చేసి కేరళకు పంపినట్టు తెలిపారు. ఈ కేసులో అధికారులు తీవ్రంగా కృషిచేస్తున్నారన్నారు. నేరస్థుల్ని త్వరలోనే అరెస్టు చేసి శిక్షిస్తామన్న విశ్వాసాన్ని సీఎం వ్యక్తంచేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో తాము రాజీపడబోమని.. దేశ వ్యతిరేక, మతతత్వశక్తుల వ్యవస్థీకృత నేరాలపై యుద్ధం ప్రకటించామన్నారు. వాటి ఫలితాలు ప్రజలకు తెలుస్తాయని.. అందరూ సంయమనంతో ఉండాలని బొమ్మై విజ్ఞప్తి చేశారు.
Also Read
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
బొమ్మై నేతృత్వంలోని కర్ణాటక బీజేపీ ప్రభుత్వం గురువారంతో ఏడాది పూర్తి చేసుకుంది. ఉత్తరప్రదేశ్లో పరిస్థితిని పరిశీలిస్తే, రాష్ట్రాన్ని నిర్వహించడానికి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ సరైన వ్యక్తి అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. కర్ణాటకలో మతతత్వ శక్తులను ఎదుర్కోవటానికి వివిధ పద్ధతులను అనుసరిస్తున్నామని.. కానీ, పరిస్థితులు డిమాండ్ చేస్తే కర్ణాటకలోనూ ‘యోగి మోడల్’ ప్రభుత్వమే వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ చర్యలు వివాదాస్పదంగా మారినా కూడా.. కర్ణాటకలోనూ అలాంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బొమ్మై వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..