BS Yediyurappa Retirement: రాజకీయాలకు గుడ్బై.. ఇక నా వళ్లకాదు అంటున్న సీనియర్ పొలిటీషియన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ సీనియర్ పొలిటీషనర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే సూచనలు చేశారు.. కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంకేతాలు ఇచ్చారు.. ఇప్పటి వరకు తాను ప్రాతినథ్యం వహిస్తూ వచ్చిన శికరైపుర అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ చేస్తున్నాను.. ఇకపై తన కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర అక్కడి నుంచి బరిలోకి దిగుతారని.. రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి విజయేంద్ర పోటీ చేస్తారని తెలిపారు. నాలుగుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్ యడియూరప్ప తన రెండవ కుమారుడైన విజయేంద్ర కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్మెంట్ను సూచిస్తూ, యడ్యూరప్ప తన కుమారుడికి ప్రజల మద్దతును కోరాడు మరియు తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.. కాగా, యడ్యూరప్ప 1983 నుంచి ఎనిమిది సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు..
మీరు నన్ను ఆదరించిన విధంగానే విజయేంద్రను కూడా ఆదరించాలని కోరుతున్నాను.. లక్ష ఓట్లకు పైగా మెజార్జీ సాధించేలా చూడాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు యడియూరప్ప.. ఇక, తాను వారానికోసారి నియోజకవర్గంలో పర్యటిస్తానని, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యర్థి కాంగ్రెస్పై విరుచుకుపడిన ఆయన, పార్టీలో ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.. 79 ఏళ్ల యడియూరప్ప.. లింగాయత్ నేతగా ఎదిగారు.. 2014లో షిమోగా నుండి లోక్సభ ఎంపీగా కూడా గెలిచారు. ఆయన కుమారుడు బీవై రాఘవేంద్ర 2014లో షికారిపుర నుంచి అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ టిక్కెట్పై విజయం సాధించారు.. ఇక, యడియూరప్పపై అనేక అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి.. కొన్ని వివాదాలు కూడా వెంటాడాయి.. కర్ణాటకలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉందని చెప్పుకోవాలి.
Also Read
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
తాజావార్తలు
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!