BS Yediyurappa Retirement: రాజకీయాలకు గుడ్బై.. ఇక నా వళ్లకాదు అంటున్న సీనియర్ పొలిటీషియన్
ఓ సీనియర్ పొలిటీషనర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే సూచనలు చేశారు.. కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంకేతాలు ఇచ్చారు.. ఇప్పటి వరకు తాను ప్రాతినథ్యం వహిస్తూ వచ్చిన శికరైపుర అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ చేస్తున్నాను.. ఇకపై తన కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర అక్కడి నుంచి బరిలోకి దిగుతారని.. రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి విజయేంద్ర పోటీ చేస్తారని తెలిపారు. నాలుగుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్ యడియూరప్ప తన రెండవ కుమారుడైన విజయేంద్ర కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్మెంట్ను సూచిస్తూ, యడ్యూరప్ప తన కుమారుడికి ప్రజల మద్దతును కోరాడు మరియు తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.. కాగా, యడ్యూరప్ప 1983 నుంచి ఎనిమిది సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు..
మీరు నన్ను ఆదరించిన విధంగానే విజయేంద్రను కూడా ఆదరించాలని కోరుతున్నాను.. లక్ష ఓట్లకు పైగా మెజార్జీ సాధించేలా చూడాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు యడియూరప్ప.. ఇక, తాను వారానికోసారి నియోజకవర్గంలో పర్యటిస్తానని, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యర్థి కాంగ్రెస్పై విరుచుకుపడిన ఆయన, పార్టీలో ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.. 79 ఏళ్ల యడియూరప్ప.. లింగాయత్ నేతగా ఎదిగారు.. 2014లో షిమోగా నుండి లోక్సభ ఎంపీగా కూడా గెలిచారు. ఆయన కుమారుడు బీవై రాఘవేంద్ర 2014లో షికారిపుర నుంచి అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ టిక్కెట్పై విజయం సాధించారు.. ఇక, యడియూరప్పపై అనేక అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి.. కొన్ని వివాదాలు కూడా వెంటాడాయి.. కర్ణాటకలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉందని చెప్పుకోవాలి.
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!