Business Flash: టాప్-3లో తెలంగాణ. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ థర్డ్ ఎడిషన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Flash: యూజర్లు తగ్గినా.. పెరిగిన షేర్లు
స్ట్రీమింగ్ మీడియా కంపెనీ నెట్ఫ్లిక్స్కి యూజర్లు తగ్గినా షేర్లు పెరగటం విశేషం. 9 లక్షల 70 మంది సబ్స్క్రైబర్ల తగ్గుతారని సెకండ్ క్వార్టర్ ఆదాయ నివేదికలో వెల్లడించింది. ఫస్ట్ క్వార్టర్లో 2 లక్షలు తగ్గొచ్చన్న అంచనాలతో పోల్చితే ఇది తక్కువే కావటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో రెండు లక్షల ఖాతాలు తగ్గటంతో ఈ సంస్థ షేర్లు దాదాపు 67 శాతం పడిపోయాయి. అయితే.. తాజా ఫలితాలతో నెట్ఫ్లిక్స్ స్టాక్స్ 7 శాతం పెరగటం చెప్పుకోదగ్గ విషయం. దీంతో 216 డాలర్ల ఆదాయం సమకూరింది. నెట్ ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు నిబంధనలను మారుస్తుండటంతోపాటు సబ్స్క్రిప్షన్ ఛార్జీలను పెంచుతుండటంతో యూజర్లు విసుగెత్తిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గటానికి ఇదీ ఒక కారణమని చెబుతున్నారు.
Also Read
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
టాప్ లెవల్లో తెలంగాణ
నీతి ఆయోగ్ ఇవాళ విడుదల చేసిన 2021 ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ థర్డ్ ఎడిషన్లో తెలంగాణ, కర్ణాటక, హర్యానా అగ్ర స్థానంలో నిలిచాయి. మేజర్ స్టేట్స్ కేటగిరీలో కర్ణాటకకు అగ్ర స్థానం లభించింది. ఈ విభాగంలో గతంలోనూ ఆ రాష్ట్రమే టాప్లో నిలవటం ప్రస్తావనార్హం. తాజా నివేదికలో రెండు, మూడు స్థానాల్లో తెలంగాణ, హర్యాణా ఉన్నాయి. రాష్ట్రాల ఆవిష్కరణల సంసిద్ధతకు ఇదో సంకేతమని చెప్పొచ్చు. ఈ విషయంలో వివిధ రాష్ట్రాల పనితీరును నీతి ఆయోగ్ విశ్లేషించి ఇండెక్స్ను తయారుచేస్తుంది.
read also: Rythu Bima: రైతు బీమా ఇవ్వనందుకు ఎల్ఐసీకి రూ.50 వేల జరిమానా, వడ్డీ
12 శాతం తగ్గిన విప్రో నికర లాభం
మన దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రోకి ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో నికర లాభం 12 శాతం తగ్గింది. అమెరికాయేతర క్లయింట్లలో ఆర్థిక మాంద్యం భయాలు నెలకొనటమే దీనికి ప్రధాన కారణం. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనూ విప్రో 18 పెద్ద డీల్స్ కుదుర్చుకోవటం ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఒప్పందాల మొత్తం విలువ 1.1 బిలియన్ డాలర్లు. దీంతో లాభాల మార్జిన్లపై ఒత్తిళ్లు ఇకపై ఉండబోవని విప్రో ప్రకటించింది.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!