కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఎన్నికల ప్రచారంలో దిగబోతున్నారు. కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కిచ్చా సుదీప్ బీజేపీ తరుపున ప్రచారం చేయనున్నారు. తాను కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనని, పార్టీ తరపున మాత్రమే ప్రచారం చేస్తానని సుదీప్ చెప్పారు.
Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఆయనకు బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై కిచ్చా సుదీప్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Karnataka Elections: కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పోరాటం ప్రారంభం అయింది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్, మరోసారి అధికారం నిలుపుకునేందుకు బీజేపీ, కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు జేడీఎస్ ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య తనకు ఇవే చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు.
Rahul Gandhi: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు, మే 13న ఫలితాలను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు వెల్లడించింది. దీంతో రానున్న నెల రోజులు కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ విస్తృతంగా ప్రచారం చేయబోతున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల్లో ప్రచారానికి కాంగ్రెస్ కీలక నేత, ఇటీవల అనర్హతను ఎదుర్కొన్న రాహుల్ గాంధీ సిద్ధం అవుతున్నారు. తాను ఎక్కడైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, పరువునష్టం కేసులో శిక్ష…
Karnataka: కర్ణాటక ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న పోలింగ్ నిర్వహించి మే 13న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చిపడింది. మంగళవారం మాండ్యాలో ప్రచారం చేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నోట్లను వెదజల్లడం జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఒక రోజు ముందు ఈ ఘటన జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్…
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే విడతలో కర్ణాటక ఎన్నికలను జరపనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
పార్లమెంటు ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నియాజకవర్గం సీటుకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారా? అయితే.. ఎప్పుడు..? అనే చర్చ తెరమీదకు వచ్చింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రకటించనుంది. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.
కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శనివారం దావణగేరేలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే హఠాత్తుగా ఓ వ్యక్తి ప్రధాని కాన్వాయ్ దగ్గరకు పరిగెత్తుతూ వెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కర్ణాటక హుబ్బళ్లి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇలా ప్రధాని పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరగడం ఇది రెండోసారి. మోదీకి దగ్గరగా వెళ్లాలనుకున్న వ్యక్తని…
Karnataka: కర్ణాటక ఎన్నికల ముందు అక్కడి అధికార బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లలో 4 శాతం ముస్లిం కోటా రిజర్వేషన్లను రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లను 56 శాతానికి పెంచింది. ముస్లింలకు 4 శాతం ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ముస్లింలు 10 శాతం ఆర్థికంగా బలహీన విభాగం(ఈడబ్ల్యూఎస్) కేటగిరిలో రిజర్వేషన్ పొందే అవకాశం మాత్రమే ఉంటుంది. ముస్లింల 4 శాతం కోటాను ఇప్పుడు వొక్కలిగా, లింగాయత్ లకు ఇవ్వనున్నారు.