Karnataka: కాంగ్రెస్కు డీకే శివకుమార్ తలనొప్పి.. నోట్లు వెదజల్లడంపై విమర్శలు..
Karnataka: కర్ణాటక ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న పోలింగ్ నిర్వహించి మే 13న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చిపడింది. మంగళవారం మాండ్యాలో ప్రచారం చేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నోట్లను వెదజల్లడం జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఒక రోజు ముందు ఈ ఘటన జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది.
Read Also: Kodali Nani On 2024 Elections: 2024 ఎన్నికల్లో టీడీపీకి వచ్చేవి నాలుగు సీట్లే
Also Read
- Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
డీకే శివకుమార్ కరెన్సీ నోట్లను వెదజల్లిన వీడియో వైరల్ గా మారింది. 500 వందల రూపాయల నోట్లను వెదజల్లడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య చెంపదెబ్బ కొట్టిన వీడియో కూడా ప్రస్తుతం కన్నడనాట వైరల్ అవుతోంది. డీకే శివకుమార్ కరెన్సీని వెదజల్లడంపై ఇది అవినీతి సొమ్ము అని, అధికారంలోకి వస్తే కర్ణాటకను దోచుకుంటారని బీజేపీ విమర్శిస్తోంది.
దీనిపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. కాంగ్రెస్ కర్ణాటక ప్రజలను బిచ్చగాళ్లలా చూస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రజలే నిజమైన యజమానులు అని చెప్పారు. కాంగ్రెస్ నిరాశలో ఉందని, మిగిలిన సీట్లను బీజేపీ నుంచి వచ్చిన వారికి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందని బొమ్మై ఆరోపించారు. మిగిలిన 100 స్థానాల్లో కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ ఎవరికి ఇవ్వలేదని, మా బీజేపీ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఫోన్ చేసి పోటీ చేయమని ప్రతిపాదిస్తున్నారని సీఎం అన్నారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి అని, వారు నిజంగా బలంగా ఉంటే ఎందుకు మా ఎమ్మెల్యేలను పిలుస్తున్నారని ప్రశ్నించారు.
Y’day, D K Shivkumar, Karnataka Congress President, was caught on camera, throwing 500 rupee notes, during a road show in Srirangapatna. This is corruption money. If the Congress were to ever come to power in Karnataka, they will drain the exchequer and stop all development work. pic.twitter.com/SUCJGgp1Ld
— Amit Malviya (@amitmalviya) March 29, 2023
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!