Karnataka Elections: కర్ణాటకలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా కిచ్చా సుదీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఎన్నికల ప్రచారంలో దిగబోతున్నారు. కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కిచ్చా సుదీప్ బీజేపీ తరుపున ప్రచారం చేయనున్నారు. తాను కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనని, పార్టీ తరపున మాత్రమే ప్రచారం చేస్తానని సుదీప్ చెప్పారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన సుదీప్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి మద్దతు ఇస్తున్నట్లు ధృవీకరించారు. దీనిపై సీఎం బొమ్మై స్పందిస్తూ.. సుదీప్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడు కాదు.. నాకు మద్దతు ప్రకటించాడు. అంటే ఆ పార్టీకి (బీజేపీ) మద్దతిస్తున్నాడని అర్థం అని వ్యాఖ్యానించారు.
Also Read:Salaar 2: ఎన్టీఆర్ 31 వెనక్కి సలార్ 2 ముందుకి… ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్
మరోవైపు సుదీప్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరగ్గా.. ఆయనకు బెదిరింపు లేఖ కూడా వచ్చింది. బెదిరింపు లేఖపై, పంపినవారికి తగిన సమాధానం ఇస్తానని సుదీప్ పేర్కొన్నారు. బెదిరింపు లేఖ ఎవరు పంపారో తనకు తెలుసు అని అన్నారు. అది సినిమా పరిశ్రమలోని ఒకరి నుండి వచ్చిందని,తాను వారికి తగిన సమాధానం ఇస్తానని చెప్పారు. కష్ట సమయాల్లో తన పక్షాన నిలిచే వారికి అనుకూలంగా పని చేస్తానని సుదీప్ చెప్పారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
Also Read:Harish Rao: పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్
కిచ్చా సుదీప్ కాషాయ పార్టీలో చేరతారనే ఊహాగానాల మధ్య అతనికి బెదిరింపు లేఖ వచ్చింది. నటుడి మేనేజర్ లేఖ అందుకున్న తర్వాత, అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కిచ్చా సుదీప్ మేనేజర్ జాక్ మంజుకి సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తి నుండి లేఖ వచ్చింది. మెసేజ్ని ఓపెన్ చేయగానే నటుడి ‘ప్రైవేట్ వీడియోలు’ విడుదల చేస్తామని బెదిరించే లేఖను చూసి మేనేజర్ షాక్ అయ్యాడు. దీంతో నటుడు మేనేజర్ పుట్టెనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు. కాగా, కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న పోలైన ఓట్లను లెక్కించనున్నారు.
తాజావార్తలు
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!