Karnataka Elections: నేడు కర్ణాటకలో మోగనున్న ఎన్నికల నగారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రకటించనుంది. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీకు మే వరకు గడువు ఉంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రధాన పార్టీలు తమ ప్రచార హోరును పెంచాయి. బీజేపీ, కాంగ్రెస్లు తమదైన వ్యూహాలు ప్రతివ్యూహాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాల్లో, అధికార బీజేపీ కనీసం 150 స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఈ సారి కాంగ్రెస్ పార్టీ కాస్త దూకుడు ప్రదర్శిస్తోంది. షెడ్యూల్ రాకముందే త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించింది.కాంగ్రెస్, జేడీ(ఎస్) వరుసగా 124, 93 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించాయి. వరుణ నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కనకాపూర్ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పోటీ చేయనున్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో 124 మంది అభ్యర్థుల్లో దాదాపు సగం మంది అభ్యర్థులు లింగాయత్లు, వొక్కలిగలు అనే రెండు ఆధిపత్య వర్గాల నుంచి వచ్చారు. ఈ రెండు ఆధిపత్య వర్గాలతో పాటు, దళితులు, గిరిజనులు ప్రకటించిన జాబితాలో రెండంకెల వాటాలను పొందారు. ప్రస్తుత అసెంబ్లీ నుండి 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో తొమ్మిది మంది ఇంకా కాంగ్రెస్లో ఉన్నారు. మిగిలిన వారికి కాంగ్రెస్ పార్టీ వసతి కల్పించింది. ఇందులో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Also Read
Read Also: India: ఎస్సీవో భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ ఆతిథ్యం.. హాజరు కానున్న పాక్!
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్ ఊహించినట్లుగానే కనకాపూర్ నుంచి పోటీ చేస్తారు. బీటీఎం లేఅవుట్ నుంచి మాజీ మంత్రి రామలింగారెడ్డి, జయనగర్ నుంచి ఆయన కుమార్తె సౌమ్యారెడ్డి పోటీ చేయనున్నారు. ఎస్ఎస్ మల్లికార్జున దావణగెరె ఉత్తర నియోజకవర్గం నుంచి, ఆయన తండ్రి షామనూరు శివశంకరప్ప దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. దేవనహళ్లి స్థానంలో కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మునియప్ప పోటీ చేయనుండగా, ఆయన కుమార్తె రూపా శశిధర్ (రూపకళ ఎమ్) కేజీఎఫ్ నుంచి పోటీ చేయనున్నారు.
బెంగళూరులోని విజయనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. కృష్ణప్పకు టికెట్ లభించగా, గతసారి ఓడిపోయిన ఆయన కుమారుడు ప్రియాకృష్ణకు గోవిందరాజ్ నగర్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఇచ్చారు. రాణేబెన్నూరు నియోజకవర్గం నుంచి మాజీ స్పీకర్ కేబీ కోలివాడ తనయుడు ప్రకాశ్ బరిలోకి దిగనున్నారు. సాగర్ నియోజకవర్గం నుంచి తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని మాజీ స్పీకర్ కాగోడు తిమ్మప్ప కోరగా, అది ఆమోదం పొందకపోవడంతో గోపాలకృష్ణ బూలూరుకు సీటు కేటాయించారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధృవనారాయణ కుమారుడికి అవకాశం లభించడంతో ఆయన నంజనగూడు (రిజర్వుడు-ఎస్సీ) నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. కలబుర్గి జిల్లా అఫ్జల్పూర్కు ఇంకా టిక్కెట్ ప్రకటించలేదని, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంవై పాటిల్ తన కుమారుడికి సీటు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి 8 మంది అభ్యర్థులు ఉన్నారు. బెంగళూరులోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 17 స్థానాలకు టిక్కెట్లు ప్రకటించగా, సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు లభించాయి.
తాజావార్తలు
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్పై మెగాస్టార్ రియాక్షన్ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!