కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎగువ మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 8,790 క్యూసెక్కుల ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజ్లో గేట్లను ఎత్తి ఉంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
Kaleshwaram Project: కాంట్రాక్టులు పొందిన నిర్మాణ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాయా? లేక కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారా? దీనిపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్లో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించిన కమిటీ.. ఇప్పుడు విచారణను వేగవంతం చేసింది. అయితే.. ఈనేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ చీఫ్
ఎంఎడిగడ్డ బ్యారేజీ మధ్యంతర పనులు ఊపందుకున్నప్పటికీ , ఈ పనులు పూర్తయ్యేలోపు గోదావరి బావి నుండి నీటిని ఎత్తిపోసేందుకు పంపింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అంతర్భాగమైన మేడిగడ బ్యారేజీ ప్రస్తుత పరిస్థితిలో రోజుకు రెండు టిఎంసిల సామర్థ్యం�
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణ సమస్యలపై తదుపరి అధ్యయనాల బాధ్యతలు చేపట్టిన మూడు కేంద్ర సంస్థల్లో ఒకటైన పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) తన నిపుణుల బృందాన్ని బుధవారం రాష్ట్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విధ
Kaleshwaram: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్ నుంచి కుప్పకూలడం, మురుగు కాలువలు ఏర్పాటయ్యే వరకు సమగ్ర వివరాలను వెంటనే అందించాలని నీటిపారుదల శాఖ సంబంధిత ఇంజినీర్లను ఆదేశించింది.
Kaleshwaram Project: నేడు మేడిగడ్డకు జస్టీస్ పినాకి చంద్రఘోష్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు ఆదేశించిన నేపద్యంలో పర్యటించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకు ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ, గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో.. కోఠిలోని సీబీఐ జీడీకి కంప్లైంట్ చేసినట్లు పాల్ తెలిపారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆరుగురు నిపుణుల కమిటీ నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనుంది. ఎన్డీఎస్ఏ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనుంది.