Beerla Ilaiah : బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. అందులో నుంచి దూకాలని కవిత చూస్తోంది..
- పదేండ్ల బీఆర్ఎస్ పాలను లేఖ ద్వారా కవిత బయటపెట్టింది
- పదేండ్ల లో కవితకు ఎస్సీ, ఎస్టీ,బీసీ లు గుర్తుకు రాలేదు..
- సభలో నియంతలా కేసీఆర్ ఒక్కడే మాట్లాడాడు అని కవిత చెప్పింది
- బీజేపీతో మీకు ఉన్న సంబంధం కవిత బయట పెట్టింది
- ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదేండ్ల బీఆర్ఎస్ పాలను లేఖ ద్వారా కవిత బయటపెట్టిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు.. బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. అందులో నుంచి దూకాలని కవిత చూస్తోందని విమర్శించారు.. పదేండ్లలో కవితకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకు రాలేదన్నారు.. వరంగల్ సభలో నియంతలా కేసీఆర్ ఒక్కడే మాట్లాడాడు అని కవిత చెప్పిందని.. బీజేపీతో మీకు ఉన్న సంబంధం కవిత బయట పెట్టిందన్నారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణన పై కేసీఆర్ మౌనంగా ఉన్నారని కవిత తన లేఖలో స్పష్టం చేసిందని చెప్పారు. పదేండ్లు దోచుకున్న సంపదలో వాటాల కోసమే కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ ఏర్పడిందని సంచలన ఆరోపణలు చేశారు.. పదేండ్లు కవిత ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. ఆస్తుల పంపకాలలో తేడాలు రావడం తో కవితకు ఎస్సీ ఎస్టీ బీసీలు గుర్తుకు వచ్చారని తీవ్రంగా విమర్శించారు..
READ MORE: Mysore Pak: ‘‘పాక్’’ ఉందని ‘‘మైసూర్ పాక్’’ పేరు మార్చేశారు.. కొత్త పేరు ఏంటంటే..
Also Read
ఎస్సీ, ఎస్టీ, బీసీలను కేసీఆర్ పార్టీ నుంచి బయటికి పంపినప్పుడు కవితకు గుర్తుకు రాలేదా? అని విప్ బీర్ల ఐలయ్య ప్రశ్నించారు. పార్టీ నుంచి బయటకు పంపుతారన్న భయంతోనే కవిత ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు.. బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందాన్ని బయట పెట్టినందుకు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడిందని… పార్లమెంట్ ఎన్నికల ముందే కవిత ఈ విషయాన్ని బయట పెడితే బీజేపీకి ఆ సీట్లు కూడా వచ్చేవి కావన్నారు.. పదేండ్లు కేసీఆర్ ఫాం హౌజ్ నుంచి పాలన చేస్తుంటే కవిత ఎందుకు మాట్లాడలేదు..? అని ప్రశ్నించారు. జనాలు ప్రతిపక్ష పాత్ర ఇస్తే పట్టించుకోకుండా కేసీఆర్ ఫాం హౌస్ కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కవిత లేఖ పైన కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. హరీష్ రావు బీజేపీలోకి పోతుంటే కేటీఆర్ ఆయన కాళ్ళు పట్టుకున్నారని మీడియాలో వస్తే చూశానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి జరగలేదని నమ్మితే కేటీఆర్ సీబీఐ విచారణ కోరాలని సూచించారు. కాళేశ్వరం పైన సీబీఐ విచారణ కోరుతు బీఆర్ఎస్ పార్టీ కేంద్రానికి లేఖ రాయాలని స్పష్టం చేశారు..
READ MORE: Gautam Gambhir: ఇంగ్లాండ్ సిరీస్కు ముందు.. గంభీర్కు ఊహించని షాక్..!
మేడిగడ్డలో కాంగ్రెస్ వాళ్లు బాంబు పెట్టారని కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బీర్ల ఐలయ్య మండిపడ్డారు.. “కేటీఆర్ మైండ్ దొబ్బినట్లు కనిపిస్తోంది.. మేము బాంబులు ఎందుకు పెడతాము. డబ్బు మదంతో కేటీఆర్ మాట్లాడుతున్నాడు.. మా సీఎం మీద కేటీఆర్ అవాకులు చెవాకులు పేలితే మా కార్యకర్తలు బట్టలు ఇప్పించి రోడ్డు మీద కొడతారు.. హరీష్ రావు ఆరు అడుగులు ఉన్నాడు కానీ దామాక్ లేదు. కవిత కేసీఆర్ తప్పులు జనాలకు మీరు చెప్పినందుకు తెలంగాణ ప్రజలు సంతోషిస్తున్నారు.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. బీఆర్ఎస్ గురించి ఆలోచించే సమయం మా ముఖ్యమంత్రికి లేదు..” అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Gyanesh Kumar: ప్రపంచంలోనే భారత్లో విశ్వసనీయమైన ‘సర్’ నిర్వహిస్తున్నాం
-
Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
-
Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్లో దుమ్మురేపిన వినేష్ ఫోగట్.. ప్రత్యర్థిపై వీరోచితం పోరాటం
-
USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
-
Vivo Over Ear Headphones: వివో తొలి వైర్లెస్ ఓవర్-ఇయర్ హెడ్ఫోన్స్ విడుదల.. 75 గంటల బ్యాటరీ, 58dB ANC ఫీచర్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..