Kishan Reddy : బీజేపీ- బీఆర్ఎస్ పొత్తు అంశంపై స్పందించిన కిషన్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు..!
- మేము ఆ రెండు పార్టీలకి జవాబు దారి కాదు
- కేసీఆర్, రేవంత్రెడ్డి ఎన్ని తిట్టినా పోయేదేమీ లేదు
- రెండు పార్టీలో ఒప్పందం మేరకు దాడి చేస్తున్నాయ్
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేము ఆ రెండు పార్టీలకి జవాబు దారి కాదని కాంగ్రెస్, బీఆర్ఎస్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎన్ని తిట్టినా తమకు పోయేదేమీ లేదని స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు పార్టీలో ఒకరికొకరు ఒప్పందం కుదుర్చుకొని బీజేపీపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దోచుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్- బీజేపీ పొత్తు అంశంపై కిషన్రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ మునిగిపోతున్న నావ.. ఆ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చేశారు. కేసీఆర్ కుటుంబ కలహాలు వాళ్ళు తేల్చుకోవాలని… ఎవరు ఎక్కువ దోచుకొన్నారు… దోచుకున్నది పంచోవడం పైనే ఆ కుటుంబంలో ఘర్షణ మొదలైందని ఎద్దేవా చేశారు. బీజేపీ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని.. కవిత చిప్ప మాకు అవసరం లేదు… ఆమె గురుంచి మాట్లాడాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆమె ఏందో తెలుసన్నారు.
READ MORE: US Report: భారత ప్రథమ శత్రువు చైనా, తర్వాతి స్థానంలో పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..
Also Read
- Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
హరీష్ రావు కాంగ్రెస్ దగ్గరగా ఉన్న వ్యక్తి అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. “విభజన సమయంలో పోలవరానికి జాతీయ హోదా ఇస్తుంటే ఎందుకు అడగలేదు. కేసీఆర్ చెప్పాలి.. ఎందుకు విభజన చట్టంలో తెలంగాణ ప్రాజెక్ట్ పెట్టాలని డిమాండ్ చేయలేదు.. సోనియా దేవత అని పోయి కాళ్ళు పట్టుకున్నారు కదా… తెలంగాణ బిడ్డగా తెలంగాణ కోసం పని చేస్తాం.. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతాం. హరీష్ రావు నీ సూచనలు కేటీఆర్, కవిత లకు చెప్పుకో.. అప్పుడు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిన అవినీతి పార్టీ… దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కోరాలని సీఎం రేవంత్ ను డిమాండ్ చేస్తున్న.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: BJP MP Laxman: ఏపీలో జగన్, షర్మిల.. తెలంగాణలో కేటీఆర్, కవిత సీన్లు ఒక్కటే..!
ఆపరేషన్ సిందూర్ విషయంలో బాధ్యత రహితంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని కిషన్రెడ్డి తెలిపారు. పాకిస్థాన్ సైనికుల మాట కాంగ్రెస్ మాట్లాడుతుందని… కేసీఆర్ హయంలో జరిగిన అవినీతిని ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళాలి చెప్పాలన్నారు. అవినీతి కి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని… ఈటెల రాజేందర్ కాళేశ్వరం విషయంలో ఏమీ తెలిసిన చెప్పాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!