Uttam Kumar Reddy : తప్పుడు నిర్మాణంతో కాలేశ్వరం అనర్థ దిశగా.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
- కాలేశ్వరం నిర్మాణంలో ఘోష్ కమిషన్ బయటపెట్టిన లోపాలు
- తప్పుడు డిజైన్, టెక్నాలజీతో సాగునీటి ప్రాజెక్టు అస్తవ్యస్తం
- బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి ప్రాణప్రధాన పథకాలు బలికాపడ్డాయి : ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : హుజూర్నగర్లో ఇరిగేషన్ శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేలా ఉన్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ఆయన బహిరంగంగా ఆరోపించారు. నిజాలు బయటపడేందుకు ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీల ఫౌండేషన్లోనే లోపాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. “బెరాజీలు కూలిపోయే పరిస్థితి వస్తే ప్రభుత్వంగా విచారణ జరపాల్సిన బాధ్యత మాపై ఉంటుంది,” అని మంత్రి అన్నారు. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Mani Ratnam : భారీ కలెక్షన్స్ కోసమే సినిమాలు చేయొద్దు.. మణిరత్నం హాట్ కామెంట్స్..
Also Read
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
ఘోష్ కమిషన్కు నోటీసులు అందిన తర్వాత బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు ప్రజలు ఖండిస్తున్నారని మంత్రి చెప్పారు. “బీఆర్ఎస్ హయాంలోనే ఇంజనీర్లు ప్రాజెక్టు లోపాలను గుర్తించి, NDSAకి నివేదిక ఇచ్చారు,” అని గుర్తు చేశారు. సమస్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిషన్ను బద్నాం చేయడం బాధాకరమన్నారు. “నిర్మాణం మొదలై నెల రోజుల్లోనే ఇంజనీర్లు లోపాలు గుర్తించారు. కానీ, కమీషన్ల కోసం నాలుగేళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు,” అని మంత్రి విమర్శలు గుప్పించారు. తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే రైతులకు మేలు జరిగేది అన్నారు.
కాలేశ్వరం నిర్మాణం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఇరిగేషన్ వ్యవస్థ దెబ్బతిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత సాగునీటి ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాల్సిన కాలేశ్వరం తప్పుదోవ పట్టడం బాధాకరమన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ చూస్తే స్పష్టంగా కనిపిస్తున్నది ఒక్కటే – గత పాలనలో జరిగిన అవకతవకలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా రంగంలోకి దిగినట్టు ఉంది. ఇక ప్రజలు కూడా ఈ విచారణల్లో నిగ్గు తేలే నిజాల కోసం ఎదురు చూస్తున్నారు.
Tej Pratap Yadav: 12 ఏళ్ల రిలేషన్.. గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన లాలూ పెద్ద కొడుకు..
తాజావార్తలు
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
-
INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!