KTR : ప్రజలను తప్పుదారి పట్టించేందుకు నోటీసుల డ్రామా
- ‘పాలమూరు–రంగారెడ్డి విషయంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
- సీఎం రేవంత్ రెడ్డికి ఒక వ్యాధి ఉంది.. కేటీఆర్ తీవ్ర విమర్శ
- నోటీసుల డ్రామా వెనుక అసలు ఉద్దేశం దేన్నో ప్రజలు అర్థం చేసుకోవాలి : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ రాజకీయాల్లో వేడి మరింత పెరుగుతున్న క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్… ప్రాజెక్టులు, కేసులు, బదిలీలు, నోటీసులు వంటి పలు అంశాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన ఆయన, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు నోటీసుల డ్రామా నడుస్తోందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఏమీలేదని సుప్రీం కోర్టు స్పష్టంగా తెలిపిందని కేటీఆర్ చెప్పారు. అదే విధంగా కాళేశ్వరం గురించి కూడా త్వరలో నిజాలు బయటపడతాయని అన్నారు. కేవలం రెండు పిల్లర్లు కూలిపోయిన అంశాన్ని బిగుతుగా పట్టుకుని దాన్ని రాజకీయంగా వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
Vijay Sethupathi : ఘనంగా జరిగిన ‘ఏస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
Also Read
సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో స్థిరత లేదని, ఒక్కో రోజు ఒక్కో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘‘ఒక రోజు కాళేశ్వరం కూలేశ్వరం అంటారు, మరుసటి రోజు అక్కడినుంచి నీళ్లు తేవాలని చెబుతారు. సీఎం మాటల్లో విశ్వసనీయత లేదు’’ అని ఆరోపించారు. అలాగే SLBC ప్రమాదంపై ఒక్కరిపై అయినా చర్యలు తీసుకున్నారా అని ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కేసులు, నోటీసులు వచ్చాయని కేటీఆర్ ఆరోపించారు. ఇది మరో ‘‘లొట్టపీసు కేసు’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘‘కమీషన్ గడువు ముగిసిన తర్వాత ఎందుకు పెంచారు? ఇదంతా కేవలం రాజకీయ బదులు తీయడానికే’’ అని మండిపడ్డారు. నిన్న ఈటెల రాజేందర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు.
ఇటీవల హైదరాబాద్లో మిస్ వరల్డ్ ఈవెంట్ సందర్భంగా మంత్రులు టూర్ గైడ్లుగా మారిపోయారని విమర్శించారు. ‘‘ఒకవైపు మిస్ వరల్డ్ బ్యూటీస్, మరోవైపు నోటీసులతో కాలం వెళ్లదీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో భారీగా పోలీస్ అధికారుల బదిలీలు జరగడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హోంశాఖ 30 మంది ఏఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని పలు అనుమానాలకు తావిచ్చే చర్యగా అభివర్ణించారు. ‘‘హెలికాప్టర్ను షేర్ ఆటోలా వాడుతున్నారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటివరకు కేసీఆర్కు నోటీసులు అందాయో లేదో కూడా తమకు స్పష్టంగా తెలియదని కేటీఆర్ చెప్పారు. అయితే అందితే హాజరుకావాలా లేదా అన్నదానిపై ఆలోచిస్తామని తెలిపారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ను సుప్రీంకోర్టు కూడా ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణించింది. దాన్ని రాజకీయంగా మలచే ప్రయత్నం బాధాకరం’’ అని కేటీఆర్ అన్నారు.
Viral: బైక్పై చెప్పుల పండుగ.. నెట్టింట్లో ‘భార్య ప్రతాపం’ వీడియో వైరల్..!
:
తాజావార్తలు
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్గా బోనబోయిన శ్రీనివాస్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!